పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/120

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

113


ర్భుజయుఁ బాశాంకుశధనుర్బాణధారిణియు సువర్ణమణి
మయమేఖలాపరిశోభితనితంబబింబయు రంభాస్తంభప్రతి
మానమృదూరుయుగ్మయుఁ గందర్పతూణీరసమానజంఘి
కయు దేవగంధర్వకామినీసమర్చితపాదకమలయు నిందీవ
రేక్షణయు మందారపుష్పదామవిరాజద్వేణియు మహా
త్రిపురసుందరియు జగదంబయు నైనగిరికన్యక నాత్మలోఁ
దలంచి తదనంతరంబున బాహ్యపూజాపరుండయి సవ్యాప
సవ్యంబుల గురుగణేశులఁ బూజించి యీశాన్యాద్యష్టదిగ్భా
గంబుల క్షేత్రపాలక వాస్తోష్పతి సరస్వతీ పార్వతీ ధర్మజ్ఞాన
వైరాగ్యైశ్వర్యంబుల నమోంతంబులుగాఁ బూజనంబులు
గావించి ఇంద్రాద్యష్టదిక్పాలకులను సప్తమాతృకలను నణి
మాద్యష్టసిద్ధులను ధర్మాధర్మంబులను దత్తద్దేవతాకంబు
లయినమంత్రంబుల సమర్చితులం గావించి నందీశ్వర
చండీశ్వర భృంగీశ్వర కుమారవీరభద్రసమేతుండును
దేజోమయుండును నైనసాంబసదాశివస్వామిని న్యాస
పూర్వకంబుగా రుద్రసూక్తంబుల షోడశోపచారవిధులం
బూజింపవలయు.

326


సీ.

ధ్యానంబు త్రిజగదాధారచిన్మూర్తికి
        నావాహనము శైలజాధిపతికి
నవరత్నసింహాసనము దేవదేవున
       కర్ఘ్యంబు త్రిపురసంహారునకును
బాద్యంబు త్రైలోక్యపాలనశీలున
       కాచమనంబు ఫాలాక్షునకును