పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/118

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

111


దినమునందు నిరాహారదీక్షుఁ డగుచు
నస్తమయపూర్వఘటికాత్రయంబునందు
స్నానసంధ్యాదికృత్యము ల్సలుపవలయు.

321


సీ.

తదనంతరంబున దరుణేందుశేఖరుఁ
          జిరతరభక్తిఁ బూజింపవలయు
నిర్మలస్థలమున నిబిడగోమయమిశ్ర
          జలముల నచ్చోట నలుకవలయుఁ
బంచవర్ణములుగాఁ బద్మకాదివిచిత్ర
          రంగవల్లుల నొనర్పంగవలయు
ఆమీఁద నవపల్లవామేయఫలపుష్ప
          వృతమంటపమ్ము నిర్మింపవలయు


తే.

నచట నవరత్నఖచితభద్రాసనమున
నంచితంబుగ శివమూర్తి నుంచవలయు
గంధపుష్పాదిపూజోపకరణవస్తు
సంగ్రహము చేసి మునివృత్తి సలుపవలయు.

322


తే.

ఆగమోక్తప్రకారమంత్రాభియుక్తి
నమరపీఠంబు నావాహనము నొనర్చి
నాత్మసంశుద్ధి భూతశుద్ధ్యాదివిధుల
నొప్పఁ గూర్చుండవలయు ధీరోత్తముండు.

323


క.

ధీమంతుఁ డైనశ్రేయ
స్కాముఁడు ముమ్మారు నుడువఁగాఁ దగుఁ బ్రాణా
యామంబులు నిశ్చలుఁ డై
కామాద్యంతర్విపక్షఖండనమతి యై.

324