పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/117

ఈ పుట ఆమోదించబడ్డది

110

బ్రహ్మోత్తరఖండము


తే.

వాసవుఁడు వైణవోన్నతస్వరముఁ గూర్ప
గరుడగంధర్వయక్షకిన్నరపతంగ
సిద్ధవిధ్యాధరాధిపు ల్చేరి కొలువ
హర్ష మిగురొత్త దాండవం బాడుచుండు.

315


ఆ.

ఆప్రదోషమునను హరుఁ డొక్కరుఁడు దక్కఁ
బూజ్యు లెవరు లేరు భూతలమున
ఆమహానుభావుఁ డర్చితుం డైనఁ బ్ర
సన్ను లగుదు రెపుడు సకలసురులు.

316


మ.

వనితా నీతనయుండు పూర్వమున విప్రశ్రేష్ఠుఁడై యాత్మజీ
వనరక్షార్థము దుష్ప్రతిగ్రహత యావజ్జీవపర్యంతమున్
దనరం గాలముఁ బుచ్చి దానరహితత్వం బొందుటంజేసి భై
క్షనితాంతస్థితి నుండె నీభవమునన్ సంపత్కళాహీనుఁ డై.

317


క.

కావున నీతనయుని నీ
భూవరసుతు నీప్రదోషపూజాపరులం
గావింపుము సంచితదో
షావళి నశియించు భాగ్య మబ్బెడు నెలమిన్.

318


చ.

అన విని యాధరామరవరాంగన యమ్మునిసార్వభౌమునిం
గనుఁగొని తత్పదంబులకుఁ గ్రమ్మర వందన మాచరించి యి
ట్లనియె ముదంబు మీఱఁగ మహాత్మ సదాశివపూజనక్రమం
బును వివరింపఁగావలయుఁ బూర్ణకృపారసభావ మేర్పడన్.

319


వ.

అని యడిగిన నాభూసురభామినికి శాండిల్యమహాము
నీంద్రుం డి ట్లనియె.

320

శివపూజావిధానము

తే.

ఉభయపక్షంబులందుఁ ద్రయోదశులను