పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/115

ఈ పుట ఆమోదించబడ్డది

108

బ్రహ్మోత్తరఖండము


ళనుదుములంబుగాఁ గలకలార్భటు లుప్పతిలెన్‌ బురంబునన్.

304


శా.

ఆకోలాహల మాలకించి శివపూజాసక్తి వర్జించి భీ
మాకారంబున రాజు వచ్చి విశిఖామధ్యంబున న్నిల్వఁగా
నాకాలంబున దత్ప్రధానుఁడు గృహీతారాతియై వచ్చితా
సాకల్యంబుగ దెల్పె దద్రచితచంచద్దుష్క్రియారంభముల్.

305


శా.

చండక్రోధము మీఱఁ బాండ్యవిభుఁ డాశత్రుక్షమావల్లభున్
ఖండీభూతశిరస్కుఁ జేసి దురహంకారంబు దీపింప ను
ద్దండప్రాభవ మొప్ప వచ్చి నిజసౌధంబందు మృష్టాన్నతృ
ప్తుండై కోమలపుష్పతల్పమున సుప్తుం డయ్యె మూఢాత్మతన్.

306


తే.

పంచవక్త్రునిపూజ వర్జించినట్టి
దోషమునఁ జేసి సామ్రాజ్యదూరుఁ డయ్యె
బద్ధుఁ డగువైరిఁ జంపినపాపమున ని
కృత్తమస్తకుఁ డయ్యె నానృపవరుండు.

307


ఉ.

ఆనరపాలనందనుఁ డహంకృతి మున్నుఁ బ్రదోషకాలమం
దానగజాకళత్రుని సమర్చన మాని భుజించి యంతటన్
దా నటు నిద్రఁ జెందినకతంబున నీజననంబునందు భి
క్షానియతాత్మకుం డగుచు శైశవభావమున న్మెలంగెడున్.

308


క.

ఆరాజుపత్ని సవతికి
ఘోరవిషాన్న మిడి చంపెఁ గుత్సితమతిఁ ద
త్కారణమున నిప్పుడు కుం
భీరముఖగ్రస్త మయ్యె భీతాత్మకయై.

309


క.

పరమేశ్వరుఁ బూజింపని
నరులకుఁ బేదఱిక మొదవు నగజారమణున్
ధరఁ బూజించినజనులకు