పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

107


వ.

మునీంద్రా యీబాలకుజన్మంబు సవిస్తరంబుగాఁ దెలియ
ననుగ్రహింపవలయు నని ప్రార్థించిన నావిప్రభామినిం
గటాక్షదృష్టిం జూచి యమ్మహాత్ముండు.

300


క.

తజ్జనకునిరణమృతియున్
దజ్జన్మప్రకరణంబు నక్రమువలనం
దజ్జనని మరణ మొందుట
తజ్జాతియుఁ దెలియఁజెప్పె దథ్యము గాఁగన్.

301


సీ.

అని యానతిచ్చిన యమ్మహామునిఁ గాంచి
         వెండియు ద్విజకాంత విన్నవించె
నేమికారణమున నీయర్భకునితండ్రి
         సమరరంగమున బంచత్వ మొందె
నేదుష్కృతంబున నీసొబగునితల్లి
         కర్కశగ్రాహసంగ్రస్త యయ్యె
నేకర్మమునఁ జేసి యారాజసుతునకుఁ
        జేకూఱె భిక్షాన్నజీవనంబు


తే.

ఇది మహాద్భుత మనుచు నామదికిఁ దోఁచె
తాపసోత్తమ కరుణామృతాంబురాశి
వరయ సర్వజ్ఞమూర్తి వట్లగుటఁ జేసి
యన్నియునుఁ దెలియఁగా బల్కు మిద్ధచరిత.

302


వ.

అని యడిగిన యాతాపసనర్యుం డాభూసురాంగన
కి ట్లనియె.

303


చ.

విను మిల పాండ్యరా జనఁగ వీనిగురుండు భవాంతరంబునన్
దనరి ప్రదోషపూజనము దప్పక చేయుచునుండె నంతయున్
ఘనమతి నొక్కనాఁడు శితికంఠుసమర్చన సేయునట్టివే