పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

104

బ్రహ్మోత్తరఖండము


నేఁ డెంతవింత గనుపడె
నీడింభకుఁ గన్నతల్లి యెం దఱిగినదో.

283


క.

ఈయర్భకుచే నంటక
పోయెద ననియెడుతలంపు పుట్టదు మదికిన్
వేయేల వీనిఁ గొని చని
నాయింటను బెంచుచుందు ననవరతంబున్.

284


ఆ.

అనుచు నిశ్చయించు నాత్మలోఁ జింతించు
సమ్మతించు మగుడ సంశయించు
నట్టు లిట్టు చనక యావీతభర్తృక
శిశువుమీఁదిభ్రాంతి జెందియుండు.

285


వ.

ఇట్లు డోలాయమానమానసయై విచారించుచున్నసమ
యంబున.

286


క.

విచ్చలవిడి నాక్షణమున
వచ్చె నొకానొకఁడు భిక్షువర్యుఁ డచటికిన్
మచ్చిక నాబాలకునిం
జెచ్చెర కరుణింప వచ్చుశివుఁడో యనఁగన్.

287


చ.

లలితమృదూక్తి భూసురకులాంగనఁ గన్గొని భిక్షుఁ డి ట్లనెన్
వలవదు సంశయింపఁగ నవశ్యము నీశిశువున్ భరింపు ని
శ్చలమతితోడ నీ వధికసమ్మదలీల శుభంబు లందఁగాఁ
గలవని చెప్పియాఘనుఁడు క్రమ్మర దాఁ జనియెన్‌ రయంబునన్.

288


తే.

అప్పు డాభిక్షువర్యునియాజ్ఞ శిశువు
నెత్తుకొని వేగ నాలేమ యేకచక్ర
పురమునకు వచ్చి తనయింటఁ గరుణ నునిచి
చిత్త మలరంగ వానిఁ బోషింపుచుండె.

289