పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

103


నొక్కసుతుఁ గాంచి యచ్చోట నునిచి చనియె
సలిలపానాభికాంక్షఁ గాసారమునకు.

279


క.

అమ్ముదిత పిపాసాతిశ
యమ్మునఁ జని నీరు ద్రావ నపు డొకకుంభీ
ర మ్మేగుదెంచి పట్టి హ్ర
దమ్మున దిగమ్రింగె నపుడు ధరణీశసతిన్.

280


సీ.

అంత నాబాలకుం డభ్యుదితుం డైన
        భాస్కరుం డన మహాప్రభ వెలుంగ
క్షుత్పిపాసార్తుఁ డై స్రుక్కి భూతలమున
        వసియించి రోదనధ్వని చెలంగ
నేడ్చుచు బితృమాతృహీనుఁడై యున్నచో
        నాస్థలంబునకు భిక్షార్థి యగుచు
నుమ యనఁబరగిన యొకవిప్రభామిని
        యేకహాయనసుతు నెత్తుకొనుచు


తే.

నిరత మూరూరు దిరుగుచు నరిగి యరిగి
విమలమతి వచ్చె దైవయోగమునఁ జేసి
యంత నాడింభకునిఁ గాంచి యావధూటి
మదిని జింతించి చాలవిస్మయము నొందె.

281


ఉ.

లాలితరూపకాంతిశుభలక్షణలక్షితదివ్యదేహుఁడై
నేల వసించినాఁడు జననీజనకు ల్దలపోయ నెవ్వ రీ
బాలుఁడు విఁప్రుడో నృపుఁడొ వైశ్యుఁడొ శూద్రుఁడొ కాక యున్న చం
డాలుఁడొ వీని నంటుట కొడంబడ దెంతయు నామనం బొగిన్.

282


క.

వీఁ డెవ్వఁడొకో వీనిం
జూడఁగ నచ్ఛిన్ననాభిమాత్రుం డహహా