పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

102

బ్రహ్మోత్తరఖండము


త్రాసనుఁ డగుదుర్మర్షణు
తో సంగర మపు డొనర్చె దోర్బల మెసఁగన్.

273


క.

సింధురవాజిస్యందన
బంధురసైన్యద్వయంబు పాతాళమునన్
గంధర్వపన్నగులక్రియ
సంధిల నని సేసి రపుడు శౌర్యం బెసఁగన్.

274


క.

ఆసంకులసమరంబున
నాసత్యరథుండు నిహతుఁ డయియుండ మహా
త్రాసమున గదనరంగముఁ
బాసి పరాభవము నొంది పరచెం బలమున్.

275


వ.

ఆసమయమున దుర్మర్షణప్రధానప్రముఖు లావిదర్భనగరం
బాక్రమించి చొచ్చిన యవసరమున యప్పురము ప్రణష్ట
రాజకమును ప్రక్షోభితబాలవృద్ధజనమును ప్రథావితపౌర
లోకమును ప్రభూతకోలాహలంబునై యుండె నంత.

276


మ.

అరివీరుల్ పురిలోనఁ జొచ్చినఁ దదీయారావ మాలించి యా
ధరణీపాలునిపత్ని పూర్వమున నంతర్వత్నియై యుండి త
న్నొరులెవ్వార లెఱుంగకుండ నతిమాత్రోద్భీతయై యంత స
త్వరయానంబున నేఁగె బశ్చిమహరిత్కాంతారమార్గంబునన్.

277


తే.

ఇట్లు కాంతారపథమున నేఁగి యేఁగి
యచట నొక్కసరోవరం బమరఁ గాంచి
తత్తటంబున నుండుశీతలవటంబు
క్రింద నిలిచె శ్రమంబులు డిందుపడఁగ.

278


తే.

తరుణి యవ్వేళ శుభముహూర్తంబునందు
లలితసామ్రాజ్యలక్షణలక్షితాంగు