పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/108

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

101


తాపహరుండు శంకరుఁడు దారుఁడు పూజ్యుఁడు ముజ్జగంబులన్.

267


క.

తరమే ప్రదోషమహిమల
నెఱిఁగింపఁగ నెవ్వఁ డోపు నింద్రాదిసురుల్
పరమేశ్వరు సేవింతురు
నిరతము దత్సమయమునను నిశ్చలమతులై.

268


చ.

భవభయరోగతాపబహుపాపనితాంతవిపజ్జరామహా
ర్ణవవినిమగ్నమర్త్యులకు నావ గదా పరమేశ్వరుండు నా
శివుభజనంబు నిశ్చలత చేయుమహాత్ములు ఘోరశాత్రవా
హవఫణిశైలమధ్యగతు లయ్యును బాధలఁ జెంద రెన్నఁడున్.

269


క.

ఈయర్థమునకు నొకకథ
పాయక వినుపింతు నదియుఁ బాపవినాశం
బాయుష్కర మారోగ్యము
శ్రేయస్కర మగుచు నుండు సిద్ధం బరయన్.

270

సత్యమహారాజుకథ

చ.

సరసవిదర్భదేశమున సత్యరథుం డనుభూవరుండు భా
సురతరధర్మశీలుఁడు యశోధనుఁ డాశ్రితరంజనుండు నై
నిరతము ధారుణీతలము నీతిపథంబున నేలుచుండఁగా
నరిగె ననేకవత్సరము లానరపాలునకున్ సుఖంబుగన్.

271


ఉ.

అంత కృతాంతతుల్యులు మహాబలవంతులు దుర్మదాంధు ల
శ్రాంతజయాభిలాషులు ససైన్యులునై చనుదెంచి శత్రుభూ
కాంతవరు ల్విదర్భకటకంబునఁ దన్నగరంబుచుట్టు న
త్యంతపరాక్రమంబు వెలయ న్విడియించిరి సర్వసేనలన్.

272


క.

ఆసత్యరథుఁడు నిజసే
నాసహితము గాఁగ నరిగి నానారిపువి