పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/107

ఈ పుట ఆమోదించబడ్డది

100

బ్రహ్మోత్తరఖండము


భూషణాదికములఁ బూజించి పనిచెను
మగుడ వారివారినగరములకు.

261


వ.

తదనంతరంబున నాచంద్రసేనమహీపాలుండును శ్రీకరుం
డును మహేశారాధనతత్పరులై యనేకవర్షంబులు భూలోక
మున నపరిమితసామ్రాజ్యభోగము లనుభవించి యంత్యమున
సిద్ధగంధర్వవిద్యాధరజేగీయమానులై శివలోకమునకుం జని
తత్సాయుజ్యము నొంది రని చెప్పి సూతుం డి ట్లనియె.

262


ఉ.

మౌనివరేణ్యులార మతిమంతులు శాంతులు దాంతు లైనస
న్మానవు లెవ్వరేని నియమంబున శైవకథాసుధాపయః
ఫేనము శ్రీనిధానమును వేదసమానము నైనయీయుపా
ఖ్యానము విన్న వారలకుఁ గల్గుఁ జిరాయువు భోగమోక్షముల్.

263


క.

అని చెప్పిన యాసూతుం
గనుఁగొని యిట్లనిరి శౌనకప్రముఖమునుల్
ఘనమతి వగునీవలనను
వినఁగంటిమి శైవకథలు విస్మయపదముల్.

264


ఆ.

అమృత మారగింప నరుచి లేనట్లు శ్రీ
సాంబశివునికథలు సంతతమును
వినఁగవినఁగ మాకుఁ దనివి లే దెంతయుఁ
దెలియఁ బలుకుమయ్య తేటపడఁగ.

265


వ.

అనిన సూతుం డి ట్లనియె.

266


ఉ.

తాపసులార మీరు కడుధన్యులు విశ్రుతు లెవ్వరేనియున్
మీపగిదిన్ సదాశివసమృద్ధకథల్ పలుమారు వేఁడఁగా
నోపరు ఫాలనేత్రుఁడు మహోక్షతురంగుఁడు భక్తలోకసం