పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/106

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

99


నతఁడు గోపకులకు నధినాథుఁ డగుచును
ధారుణీతలమున బేరు వెలయు.

255


శా.

ఆనందుం డతిధార్మికాగ్రణి సమస్తాభీరనాథుండు నా
దానక్షాత్రపరుండునా దగి యశోదాభర్తయై యుండఁ ద
త్సూనుత్వంబున బాలకేళి విహరించుం దన్నివాసంబునన్
శ్రీనారాయణుఁ డార్తరక్షకుఁడు శ్రీకృష్ణావతారంబునన్.

256


క.

ఉభయత్రయోదశులయం
దిభచర్మాంబరునిపూజ లెడపడకుండన్
శుభమతి జేసిననరులకు
విభవంబులు చెందు లోకవిఖ్యాతముగన్

257


చ.

ప్రవిమలకృష్ణపక్షమున భద్రకరంబు శనిత్రయోదశీ
దివసముగాన నందు సుమతిన్ శివపూజన మాచరించుమా
నవులు మహేశుసత్కరుణ నాగతురంగరథాధిరాజ్యవై
భవములు చెందియుందురు నృపాలకులార భజింపుఁ డీశ్వరున్.

258


క.

ఈగోపకుమారుని కీ
యోగము చేకూరు శనిత్రయోదశి యగుటన్
శ్రీగౌరీశార్చనమున
వేగమె సమకూరె భవ్యవిభవస్ఫూర్తుల్.

259


క.

అని పలికి గోపబాలున
కనుపమశివమంత్రములు శివాచారవిధుల్
పనుపడ నుపదేశించియు
హనుమంతుఁడు చనియె నప్పు డంతర్హితుఁడై.

260


ఆ.

చంద్రకీర్తి యైనచంద్రసేననృపాలుఁ
డఖిలభూపతులకు హర్ష మొదవ