హనుమంతుఁడు రాజులకుఁ బ్రత్యక్షంబై గోపబాలునికథఁ జెప్పుట.
శా. |
అంతన్ సర్వధరాధినాథులు ప్రమోదాయత్తులై చూడ శ్రీ
మంతుం డుజ్జ్వలకీర్తిమంతుఁ డతిధీమంతుండు దైతేయదు
ర్దాంతుం డంచితరామనామజపమంత్రధ్యానసంతోషిత
స్వాంతుం డాహనుమంతుఁ డయ్యెడను సాక్షాత్కారుఁ డయ్యెన్ గృపన్.
| 250
|
క. |
క్షిత్యధినాయకు లందఱు
నత్యుజ్జ్వలతేజుఁ డైనహనుమంతునకున్
బ్రత్యుత్థానముమొదలుగ
శ్రుత్యుపచారము లొనర్చి శోభిల్లి రొగిన్.
| 251
|
క. |
ఆక్షితిపులమధ్యంబున
నక్షాసురదమనుఁ డైనయనిలజుఁ డొప్పెన్
నక్షత్రమండలంబున
నక్షత్రేశ్వరునికరణి నభినుతుఁ డగుచున్.
| 252
|
వ. |
ఇట్లు రాజసభామధ్యంబున గూర్చుండి యమ్మరున్నందనుండు
గోపకుమారు నుద్దేశించి యమ్మహీనాథులతో ని ట్లనియె.
| 253
|
క. |
ఈవల్లవబాలుఁడు ధర
జైవాతృకుఁడై యశోవిశాలుం డగుచున్
బావనచరితుం డగుచును
శ్రీవెలయఁగ బేరు గాంచు శ్రీకరుఁ డనఁగన్.
| 254
|
ఆ. |
అరయ నితనికులజుఁ డష్టమపురుషుండు
నందుఁ డన జనించునందనుండు
|
|