పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/103

ఈ పుట ఆమోదించబడ్డది

96

బ్రహ్మోత్తరఖండము


క.

ఈవృత్తాంతము మీ రా
భూవిభునకుఁ జెప్పి రండు పొం డని పనుపం
గా వచ్చి రపుడు చారులు
వేవేగమె చంద్రసేనవిభుసన్నిధికిన్.

239


ఉ.

వచ్చి నృపాలచంద్రునకు వందనకృత్యము లాచరింపుచున్
మచ్చికఁ జారు లిట్లనిరి మానవనాయక యుద్ధకాంక్షులై
వచ్చినరాజవర్యులు శివాలయగోపకదర్శనార్థమై
వచ్చినవారు వాఁకిటికి వారలవాక్యము లాదరింపుఁడీ.

240


క.

శ్రీహరుఁడు సాక్షిగను మా
వాహనములు నాయుధములు వర్జించి మహా
స్నేహమున భవత్పురికిన్
సాహసకృత్యములు మాని చనుదెంతు మొగిన్.

241


క.

అని చారముఖంబున నుడి
విననృపవచనముల కలరి విభుఁ డతిమైత్రిన్
జనపతుల వేగ రమ్మని
తనభృత్యులఁ బంపె నతిముదంబు సెలంగన్.

242


క.

ఆదూతవరులు చని యపు
డాదేశాధీశ్వరులకు ననుమతి యొసఁగన్
మోదంబునఁ జనుదెంచిరి
నాదరతను చంద్రసేనుసన్నిధి కరయన్.

243


వ.

ఇట్లు పురంబులోనికిఁ జనుదెంచిన యారాజసత్తములకు
నత్యంతవినయంబునం జంద్రసేనమహీనాథుం డెదుర్కొని
వందనాలింగనాదిసత్కారంబుల వారల నాదరించి
తోడ్కొని తెచ్చి వారలుం దానును నత్యంతమిత్రభా