పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

95


వ.

ఇవ్విధంబున నితరవ్యాపారంబులు మాని పౌరజనపరి
వారసమేతంబుగా నమ్మహీవల్లభుండు ప్రహృష్టాంతరం
గుఁడై భుజంగాభరణం బైన యమ్మహాలింగంబునకుఁ
బూజామహోత్సవంబు సలుపుచుండె నంత.

233


క.

ఆనరపతికినిఁ దత్పర
భూనాయకులకును సంధిఁ బొసఁగించుటకై
తా నరుగుదెంచెనో యన
భానుఁడు దోతెంచె నపుడు బ్రాగ్భాగమునన్.

234


ఉ.

కూరిమి చంద్రసేననృపకుంజరుపట్టణమందు నొక్కయా
భీరకుమారుఁ డాటలకు భీమసమర్చనఁ జేయుచుండ ని
ష్కారణలీలఁ గన్పడియె శంకరుమందిర మంచు నానృపుల్
జారులు దెల్పఁగా విని భృశంబుగ విస్మయ మంది రందఱున్.

235


ఉ.

ఈవిభు సంగరంబున జయింపఁగరాదు మహానుభావుఁడున్
దైవబలాభిరాముఁడును దారయశుం డని నిశ్చితాత్ములై
యావసుధేశులందఱు రహస్యమునన్ గుమిగూడి వీనితో
నేవిధినైన నిష్టమతి నేర్పడ నుండద మంచు నెంచుచున్.

236


క.

ధీరుల నతిగంభీరుల
సారనయనాయవచోవిచారులను మహా
దారులఁ జారులఁ గనుఁగొని
యారాజకుమారు లిట్టు లని రతిమైత్రిన్.

237


క.

శ్రీహరుఁడు సాక్షిగను మా
వాహనములు నాయుధములు వర్జించి మహా
స్నేహమున భవత్పురికిన్
సాహసకృత్యములు మాని చనుదెంతు మొగిన్.

238