పుట:ప్రబోధచంద్రోదయము.pdf/72

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తీరవారినట్టి దివియ మండునె భూమి
నెంత చమురు పోసిరేని పిదప

(2-88)


క.

పరిమిశ్రితదుఃఖం బని
నిరసింతురు విషయసుఖమున నీరసబుద్ధుల్
ధర నుముకకుగాఁ విడుతురె
సరిబియ్యము వచ్చు దీనసరి ధాన్యంబున్

(2-90)

రూపకము

ఆ.

.................................సంసార
సాల మనవబోధమూలయుతము
కాన నీశ్వరాంఘ్రికమలార్చనాజాత
బోధగజము చేరి పోవవైచు

(4-4)

ఉపమ

ఇది హెచ్చుగా వాడబడినది.

ఈతఁ డెవ్వరొకొ గర్వభరంబున మండుకైవడిన్ (2-3)
ఒడిసి వడి న్నెగయు గృధ్రియంబలె (3-73)
వెనకయ వెసల యిచ్చినవిధమున (3-79)
గాండీవి జయద్రథుఁ జంపినకైవడి (4-19)
మరుదాకంపితకంపవిరహితాబ్దియుఁ బోలెన్ (4-22)
దేవి లులాయదానవు వధించి నాలీల (4-25)
కేళ్లంగి వేసినట్లు (5-3)

ఉల్లేఖము

చ.

మరగిన కామధేనువులమందలు, సిద్ధరసప్రవాహముల్
దొరికిన కల్పవృక్షములతోఁటలు, జంబునదీసమూహముల్
సురపతి రత్నపుంజములు, శుద్ధసుధాఘుటికల్, కవీశ్వరో
త్కరముల కీయనంతవిభు గంగయమంత్రి కృపాకటాక్షముల్.

1-15