18
క్రొత్తగా కల్పిస్తూ శబ్దకాఠిన్యం అన్వయక్లేశం లేకుండా పురాణశైలిలో అనువాదం చేసినాడు. "ఔచిత్యపోషణ కోసం చిన్నచిన్న మార్పులు చేసి మూలానికి మెరుగులు దిద్ది నైమిశారణ్యాన్ని నందనవనంగా మార్చినాడు."
పోతన భాగవతాన్ని-
చ. | లలితస్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం | |
-(I-20) అని వర్ణించినట్లే సింగన పద్మపురాణాన్ని ఒక పద్యంలో అమృతపయోధి (I-66) తోను, మరొకపద్యంలో తరువుతోను (I-66) పోల్చి మనోహరంగా వర్ణించినాడు.
పద్మపురాణంలో అక్కడక్కడ మూలాతిశాయి వర్ణనలు కూడ ఉన్నవి. దిలీపమహారాజు వేటాడి అలసి ఒకకొలను చెంత మాధ్యాహ్నికక్రియలు ముగించి విశ్రమిస్తుండగా సాయంకాలం ఐనది.
చ. | ఘనమగు నెండతాఁకునకుఁ గాయము కంది పరిభ్రమార్తుఁడై | (I-108) |
ఇది మూలంలో లేదు. ఇందులోని 'చల్లని రాజు' దిలీపునికి చంద్రునికి వర్తిస్తుంది. చంద్రుడు సూర్యకిరణాల మూలంగానే ప్రకాశిస్తాడనేది వైజ్ఞానికసత్యం.
పురూరవునికి తైలసేవాదోషం శ్రీమహావిష్ణువు అపనయించినంతవరకే మూలంలో ఉండగా సింగన ఊర్వశీపురూరవులసమాగమం క్రొత్తగా కల్పించినాడు. ఈ సందర్భంలోని వర్ణనం ప్రబంధఫక్కిలో ఉన్నది.