పుట:పంచతంత్రి (భానుకవి).pdf/132

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పుడు మృగవిభుం డాచమనంబు సేసి యరుగుదెంచి, గర్దభంబు
డగ్గఱి దానిహృదయకర్ణంబులు లేకుండుట వీక్షించి గోమాయువుం జూచి
దీనిహృదయకర్ణంబులు గానమని యడిగిన, జంబుకం బిట్లనియె,—

60


చ.

ఖరము మృగేంద్రవర్య! చవిగల్గిన మత్కపటప్రభాషలన్,
గరమటు మోసపోవునె! మనమ్మున మిక్కిలి గుండె కల్గినన్,
వరమతి [నిన్ను సేరుటకు] వచ్చునె! యన్న, నతండు చింతతోఁ
బొరలుచునుండ, జంబుకవిభుండును గౌతుకమందె నాత్మలోన్.

61


అది గావున నెఱిఁగి యెఱిఁగి, వెఱ్ఱి ఖరంబుగాను మృతురాకృత
పుణ్యఫలమ్మున నీచేఁ జిక్కు విడివడి బ్రతికితిఁ, గృతఘ్నుండవగు నీతోడి
సఖిత్వం బింతియి చాలు, నిష్కల్మషుండగువానికి దైవంబు సహాయంబగు
నని తన్ను నిందించు వానరేంద్రుం గని శింశుమారుండు లబ్ధనాశనంబగు
టకు మనమ్మున సంతాపించుచుఁ దనమందిరంబున కరిగెఁ దదనంతరంబున
వానరపుత్రుండగు సుశర్మయనువాఁ డేతెంచి, తండ్రికిం బ్రణామం బాచరించి
తదనుమతంబున శాఖాగ్రంబునఁ గూరుచుండి తన్మంత్రివరులచే శింశుమార
వృత్తాంతంబంతయు విని, కోపాటోపంబున జనకవిరోధిం బొరిగొనవలయు
నని చింతించి తండ్రి కిట్లనియె,— అయ్యా! శింశుమారుండు పాపి వానిం
బొరిగొనక యేల పొమ్మంటివి! అపకారికి నుపకారంబును, నుపకారికి నపకా
రంబునుఁ జేయుట ధర్మవిరోధంబు. ము న్నొకవిటుండు వేశ్యం బొరిగొన్న
యట్లు, వాని వధింపవలయుననినఁ గుమారునకుఁ దండ్రి యిట్లనియె,—

62


గీ.

పుత్ర యిట్టికథయుఁ, బూర్ణమ్ముగా నాకుఁ
దేటపడఁగ నెఱుఁగఁ దెల్పుమనిన,
నతఁడు చెప్పఁదొడఁగె, నాకథావృత్తాంత
మలరి విన్న మోహ మావహిల్ల.

63


సీ.

జనక! చెప్పెద విను చతురాంగి యన నొక్క
                    వారభామిని మరువారువంబొ!
యన నొక్కపట్టణంబున నుండు దానికి
                    నిద్దురకును నూఱుగద్దెణములు
నిత్తురు పల్లవు, లీయంగఁ దల్లియుఁ
                    దానును భోగేచ్ఛఁ దగిలియుండ