పుట:పంచతంత్రి (భానుకవి).pdf/130

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

వెనువెంటన్ రజకుండు మందగతుఁడై వేమాఱు దోలంగ మా
సినచీర ల్దనవీఁపుబంటిపయి వాసిన్మించు పెన్వామియో!
యనఁ, గాన్పింపఁగ, నొక్కగార్దభము దుఃఖావేశభావంబునన్
జనుదేరం గని, జంబుకాధిపతి యుత్సాహమ్ముతో నత్తఱిన్.

47


క.

తనభాషాచాతుర్యం
బునఁ దన్మతి గలఁచి సింహముఖ్యుని కొప్పిం
చిన, నాతఁడు బలురోగం
బున భీషణమైన లావు వోవుట చేతన్.

48


వ.

పాపభీతింబోలె నంగకమ్ములు వణఁక, నుపాయహీనంబగు సంభ్ర
మంబున భక్షింపంజూచిన, నాకీ లెఱిఁగి యాగాడిద పారిపోయిన, మృగేం
ద్రుఁడు జంబుకప్రవరుం గ్రమ్మఱఁ జూచి యిది విధివశంబున రాసభంబు నాకు
సిద్ధింపక, పోయిన పోకయై పోయెననిన, నతం డిట్లనియె,—

49


మత్తకోకిల.

చింత యేటికి నీమనమ్మున సింహసత్తమ! భీతి వి
భ్రాంతి నుధ్ధతిఁ బారినట్టి ఖరంబుఁ దెచ్చెద, నన్ను ధీ
మంతుఁగాఁ దలపోయుమంచు, నమాత్యుఁ డప్పుడు దుష్కృత
స్వాంతుఁడై చని, దానిఁ గాంచి వచఃప్రియంబున నిట్లనున్.

50


క.

ఈరజకు నంశుకమ్ముల
ధారధుకంధరత కంటెఁ బరికింపఁగ, న
ల్పారంభమె! మృగవంశో
ద్ధారకుసేవ యని, మఱి యతఁడు నిష్ఠురతన్.

51


గీ.

గార్దభత్వము నీమదిఁ గానబడియె
దైవ మీనేర్చుఁగాక సంతసము, తళ్లు
గుడువనేర్చునె! యకట చేకూరినట్టి
భాగ్యసంపద నేరమిఁ బాసికొంటి.

52


వ.

మృగరాజు సమ్ముఖమ్మున వనంబులో నీవును మద్విధంబున నతనికి
మంత్రివై యిచ్ఛావ్యవహారమ్ములఁ బరితుష్టిం బొందక, సమస్తజనమ్ముల
మలినవస్త్రమ్ములు మోవ, నీకుఁ బ్రియంబై నిష్కారణంబ మగిడి చనుదెంచు