పుట:పంచతంత్రి (భానుకవి).pdf/123

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఫలములు రాల్పఁగఁ దిని నిజ
కులకాంతను మఱచి నక్రకుంజరుఁ డుండన్.

11


ఉ.

ఆమకరేంద్రుభార్య విరహానలతప్తశరీరయై, నిజ
స్వామి విధంబెఱింగి నిముసమ్మున రమ్మని దూతి నంప, ను
ద్దామజవమ్మునం జని ముదమ్మున వానరమైత్రిచేత ని
ష్కామతనున్నవానిఁ గని, క్రమ్మఱ నాయకతోడ నిట్లనున్.

12


గీ.

శింశుమారుండు వానరస్త్రీలతోడ
మైత్రి యొనరించి యన్యమ్ము మఱచి కేళి
సేయఁదొడఁగినవాఁడని చెప్పి దూతి
మిన్నకుండెను, నక్రభామిని తలంక.

13


వ.

అంతఁ బురుషవియోగంబున నక్రభామిని హృదయమ్ములో మద
నాగ్ని ప్రజ్వరిల్లి కాల్పం బొగలెగయ, మనంబను పరమసఖుండు వెలికిం
దెచ్చెనన, వేఁడినిట్టూర్పుగాడ్పున నధరపల్లవంబు గంద, నాక్రోశితభర్తృక
యగు మకరవధూటి వెండియుం దనచేడియం బనిచిన నదియును శింశు
మారుసమ్ముఖమ్మునకుం జని సతివాక్యమ్ములు పతి కెఱిగించిన, నతఁడును
బెద్దకాలమ్మునకుఁ గుటుంబినియొద్దకుఁ బోవువాఁడై తనప్రాణసఖుండగు
బలవర్ధనున కెఱింగించి యతనిచేత నామంత్రితుండై మధురమ్ములగు
నౌదుంబరఫలమ్ములు సంగ్రహించుకొని వచ్చు నవసరమ్మున,—

14


సీ.

దవ్వుదవ్వున వచ్చు తనజీవితేశ్వరు
                    నది సూచి మిథ్యా౽మయంబు దనకుఁ
గల్పించుకొని సఖీగణము విన్నదనమ్ము
                    దాల్చి సేవింపంగ దంభవృత్తిఁ
నొడలెఱుంగనిరీతినున్న కుటుంబినిఁ,
                    బొడగాంచి పరవశంబునఁ బ్రగాఢ
సంశ్లేష మొనరించి సర్వాంగకమ్ములు
                    పుణికి మనోజాగ్నిఁ బొరల నపుడు
దుఃఖవారిధివీచులఁ దొట్రుపడుచుఁ
గన్నుదొవలను గడునశ్రుకణము లురుల