పుట:పంచతంత్రి (భానుకవి).pdf/115

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భార్య కొసఁగిన, నదియును బ్రతిదినంబు
మైత్రిఁ బోషించెఁ దనకన్నపుత్రికరణి.

103


అబ్జరేఖవోలె ననుదినమ్మును వర్ధ
[మాన] యగుచునుండె మౌని [యపుడు]
తగినవరుఁడు వలయుఁ దనకన్యకని చండ
కిరణుఁ దలఁప నాతఁ డరుగుదెంచె.

109


సీ.

అప్పుడు ఋషి పంకజాప్తునిఁబొడ గని
                    కన్యకఁ బరిగ్రహింపుమనఁగ,
బలియుఁడు నాకంటెఁ బర్జన్యుఁడన విని
                    తలఁచిన నాతఁడు నిలిచె నెదుట,
నతనిఁ జేకొమ్మన్న, నధికుండు పవమానుఁ
                    డనిన నాతనిఁ బిల్చి యడుగుటయును,
నద్రులు కడునెక్కుడని చెప్ప, [నద్రులఁ
                    బిలిచి] గైకొనుడన్నఁ బ్రీతి నవియు,


ఆ.

మూషికప్రభుండు మొదలి శూరుండన,
వాని కెఱుకసేయ వాఁడు మర్త్య
కన్య నెట్లు పొందఁగా వచ్చునన, ముని
యెలుకఁ జేసె దానిఁ దొలుతయట్ల.

110


వ.

ఇ ట్లాఘనుండు మూషికంగా జేసి మూషికవిభున కొసంగె నట్లు
గావున నెవ్వరేనియుఁ దమతమజాతిం బొందుదు, రింతియ కాని యన్య
జాతిం బొందుట దుర్లభంబు. ఈవెఱ్ఱికాకి యాడిన నెట్లని! చెప్పిన విని,
యెన్నెన్నిభంగులనైన నీఘూకపతికి హితం బాచరించెదనని పల్కుచిరం
జీవిం జూచి దివాంధవల్లభుం డిట్లనియె,—

111


క.

వలసినతఱి నాహారం
బుల నొందుచు, నీగృహంబుపోలిక నతిని
ర్మలబుద్ధి నుండుమని తనుఁ
బలికిన, ముదమంది కాకపతిసచివుండున్.

112