పుట:పంచతంత్రి (భానుకవి).pdf/106

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అప్పు డిరువురు జవమున నరిగి వాని
కంతయును జెప్పఁ, గడువృద్ధ నైతి, నాకుఁ
జెవులు వినరావు డగ్గఱి చెప్పు మనుచుఁ,
బరమధర్మము విశ్వసింపంగఁ బలికె.

59


క.

సంసారము లస్థిరము, ల
హింసకు సమమైన [ధర్మ] మేదియొ, సుజనో
త్తంసునకుఁ దెలియఁదగు నది,
కంసారిపదాబ్జభృంగ! కరణిక లక్ష్మా!

60


క.

పరకాంతలఁ దల్లులక్రియఁ
బరవిత్తము పెచ్చుమాడ్కి భావించి మదిన్
బరులశరీరమ్ములఁ దన
కరణినిఁ జూడంగవలయుఁ గరణిక లక్ష్మా!

61


వ.

అని యివ్విధమ్మున నాదధికర్ణుండు పరమధర్మశాస్త్రంబు లుపన్య
సించిన, విని మనంబున విశ్వసించి [శశ]కకపింజలులు డగ్గఱిన, నమ్మార్జాలం
బయ్యిరువు భక్షించి తనశరీరంబు పోషణంబుఁ జేసికొనెఁ, గావున నిట్టి యల్ప
ఘూకంబు గుఱిచేసి సమస్తపక్షిరాజ్యంబునకు నభిషేకం బొనరించుట
యకర్తవ్యం బనిన నయ్యవసరంబున,—

62


చ.

పతగములెల్ల వాయసము పల్కులు తథ్యములంచు నేఁగినన్
మతిఁ [దలపోసి] రోషమున మండి దివాంధుఁడు కాకిఁ జూచి కు
త్సితమున కేమి కారణము [మిసీ] విభవమ్మున [కెల్లఁ బా]యఁ జే
సితి, మును నీకు నెగ్గొకటఁ జేసితినే యని పల్కె నల్కతోన్.

63


అది మొదలుగాఁ గాకోలూకమ్ములకు వైరానుబంధ మ్మయ్యె,
నన విని మేఘవర్ణుం డాకర్ణించి జయోపాయం బెఱింగింపుమనినఁ జిరంజీవి
యిట్లనియె, సంధివిగ్రహయానాసనద్వైధీభావమ్ముల నతఁ డసాధ్యుండు.
ఆశ్రయంబుననైనను, చిరప్రయాసంబుననైనను, బగతున కపాయంబు నొందింప
వలయునని వెండియు నిట్లనియె,—

64


గీ.

పరులు పెక్కండ్రు గూడి సర్వజ్ఞునైన
మోసపుచ్చంగవచ్చు మున్ భూసురుండు