పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/206

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కేసరివధ కుద్యోగముఁ జేసిన నగ్గమక మెఱిఁగి చెలికాఁడా సం
త్రాసమునఁ దలఁగి వచ్చితి, గాసిలి ప్రాణములు తీఁపుగా యెవ్వరికిన్.

574


క.

నావిని ఘటకుం డనుఁ దగ, వా వెరవఁగ నధిపుఁ డట్టివాఁడా నిను సం
భావించుట కి ట్లొరయం, గా వచ్చుట యిందుకేల గళవళ మందన్.

575


చ.

ఠవఠవ గ్రొత్తక్రొత్త యగుటం జనియించెను నీకు నేఁడు రే
పవుటయు మమ్ము మీరఁ జనువంతయు నీయది కొంక నేల ర
మ్మవసర మిప్పు డంచుఁ జను నాఖరము న్మరలించి తెచ్చి గౌ
రవగుణ మెక్క నక్క మృగరాణ్నికటంబున బెట్టెఁ బెట్టినన్.

576


తే.

కఱుకుకఱుకునఁ గుత్తుకఁ గఱిచి విఱిచి, నక్క నక్కఱఁ జీరి శుండాలవైరి
గర్దభము కుక్షి భేదించి కర్ణహృదయ, ముదయ దాహ్లాదమున దివ్వు మోపననక.

577


వ.

ఏను సెలయేటిజలంబు లానివచ్చెద నని చెప్పి యడు గామడగా నరిగిన.

578


సీ.

ఖరశరీరము విప్పుగా గొప్పలగుదంతకుంతసంఘంబులఁ గ్రుచ్చి క్రుచ్చి
మృగధూర్త మాకర్ణహృదయంబు భేదించి యది యనర్ఘ్యం బగు టెఱిఁగి కాదె
యతులరంహము సింహ మాశించె భక్షింప నత్యాజ్య మివ్వస్తు వనుచుఁ దాన
భక్షించి పరిశుద్ధుపగిది నూరకయుండె నపుడు కంఠీరవ మరుగుదెంచి


తే.

కొనవలయు నౌషధంబు దెమ్మనినఁ గొంకు, కొసకులే కది పలికె నోకుంభివైరి
గర్దభాకారమున లేదు కర్ణహృదయ, మరియు కలిగిన నిన్నేల కదియవచ్చు.

579


సీ.

అని నక్క తక్క కిట్లాడుమాటలు యథార్థీకరించి యదల్పఁ దెరువులేమి
నుడిగెఁ గేసరి యూరకుండె న ట్లావంచకము మహాకపటవాక్యములు నమ్మి
గహనమండలి సొచ్చి క్రమ్మఱ మఱియు నేతెంచి దుర్వ్యాధిశద్విరదవైరిఁ
జేరి తద్దంష్ట్రలదోరినఖరముగాఁ దలఁపకు నన్నని బలిముఖుండు


తే.

పలుక నేమియు ననక యజ్జలచరుండు, లబ్ధనాశవ్యధాజాతలఘుగుణేత
రావిలసిపాస దీఱ నీ రానిచనియె, నద్భుతత్వరతోడ నిల్లాలిఁ జూడ.

580


క.

అని విష్ణుశర్ముఁ డాదర, మునఁ జెప్పిన రాజసుతులు ముదమున గురునిన్
గనుఁగొని పంచమతంత్రం, బనఘా మాతోడఁ జెప్పుమని యడుగుటయున్.

581


మ.

అతి హృద్బోద్ధ్రపమోహ భక్తినతదివ్యవ్యూహ విధ్యూర్జిత
క్రతుపుంజార్చితపాద వర్ధితపటుప్రహ్లాద పుణ్యవ్రతా
యతనాధ్వన్య జగత్రయీభరణవిద్యాధన్య త్రయ్యంతకీ
ర్తితపీతాంబర కృత్తిధారణశుగాధివ్యాధినిర్వారణా.

582