పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/181

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

రోహిణీవిరహభీరుక్షపాకరబింబ మన ఘనగ్లానదీనాస్య మమర
నొడలునిండారి వెల్వడినశోకరసంబుతీరున వేఁడికన్నీరు దొరుగ
మెఱుఁగుటద్దపుబిళ్ళమీదికెంపులతెరక్రియ గపోలమునఁ గెంగేలు మెఱయ
నతిమరుచ్చలమానలతభంగి నిశ్వాసధారచంద్రిక మోవి దల్లడిల్లఁ


తే.

దనయ నీలోన లేదుగదా ధరిత్రి, చూపుమా యంచు ప్రార్థించుసోయగమున
దగ శిరము వంచి తనలోన దాన పలుకు, మనుజపతిఁ గాంచి ప్రణమిల్లి మంత్రివరులు.

325


క.

నతులై వినయవిచారో, న్నతులై నిలుచుటయు వదననలినములఁ దరం
గితదృష్టి చంచరీక, ప్రతతులు నటియింప ధరణిపాలుం డనియెన్.

326


క.

అరుదెంచితి రెవ్వరు మీ, రరుదారం చెప్పుఁ డనిన నలికతటాంత
స్ఫురదంజలిపుటు లై య, న్నరనాథుం జూచి దండనాథవతంసుల్.

327


మ.

క్షితినాథోత్తమ నేఁడు నీమఱఁది మత్సిల్లుండు పుత్తేర వ
చ్చితి మాలింపు తదీయభాషితము లస్తేయవ్రతబ్రాహ్మణ
క్రతుభుగ్వైరివంతసయోగమున నీగారామునెచ్చూలి యొం
డితరక్షోణికిఁ బోకచేరె మము నీ వీక్షించి పో రాఁ దగున్.

328


క.

అని దేవరతో విన్నప, మొనరింపం బంపె విక్రమోపేతపతా
కినితో సంబంధిపురం, బున కరుదెం డనిన భూవిభుఁడు సుముఖుండై.

329


వ.

అమ్మంత్రులకుఁ బసదనంబు లిచ్చి యంతఃపురంబున కరిగి యింతికి నంతయుం దెలిపి
విన్న యది ప్రొద్దుగా సభార్యుండై చతురంగబలంబులు గొలువ వచ్చి సుకీర్తి మ
ధ్యాహ్నకాలంబునకు బాటలీపురోపకంఠంబు గదిసె నప్పుడు.

330


ఉ.

ఇంకనిఠీవి బావ తనయింటికి వచ్చినఁ జంద్రసేనుఁ డ
భ్రంకషసమ్మదాభ్యుదయభాసురుఁడై యెదురేఁగుదెంచి ప
ల్యంకిక నున్నయప్పచరణాబ్జములం బడి కాంతకాంతిమ
త్పంకజరాగపూగకృతధామకవీథికిఁ దెచ్చె దెచ్చినన్.

331


ఉ.

ముందఱ నేగి యబ్భువనమోహిని వాహినిపోలె నుబ్బునం
తం దలచుట్టు కన్దొగల దట్టముగాఁ బ్రవహించునశ్రువా
రిం దులితేతరస్తనశరీరములం దిగుపారఁజేయుచున్
వందన మాచరించి విరివాతెరతో మొగ మెత్త కేడ్చినన్.

332


సీ.

కడుపులోఁ జేపెట్టి కలఁచిన ట్లగుటయు భక్తిఁ గూరిమిపట్టిఁ బట్టియెత్తి
శిర మురంబునఁ జేర్చి చెఱువు వ్రస్సినరీతి నోడి కల్గట్టి పెల్లుఱులు నశ్రు
ధారల నతితాంతదశఁ గన్నతనువల్లి దడుపుచు గద్గదధ్వానలీల
భాషణంబుల నెంతపనియయ్యె నట్లుండె విధికృతం బనుచు నుర్వీవిభుండు