పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/167

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ల్వారువమైనచిల్క మిగులాతగులాయ మెఱుంగునమ్మ నీ
పైరుగదమ్మ మల్లికలు పల్లటమందఁగ నేల వానికిన్.

189


ఉ.

దారుణభంగిఁ బేర్చునినతాపదవజ్వలనోష్మమంటికం
ఠీరవమధ్యతాంతదశ నీతను వల్లవహించినం దగుం
గైరవసోదరస్ఫురణఁ గాంచిన నీనిడువాలుగన్నులే
లారజనిం గుభృజ్జనికళానిధిరాకకుఁ దల్లడిల్లెడిన్.

190


క.

అకటా యని చింతింపుచు, లికుచకుచ ల్నిలువ సంబళింపక శుకముం
బికము న్మలయానిలశా, బకము న్మదిఁ దలంచి వినయపాటవ మమరన్.

191


ఉ.

మాటకు రాకు ప్రోదిశుకమా యొకమారు జయింపరానికై
లాటము జేసె దేటికి భళా పికమా యిఁక మాను బోటి నీ
సాటియె ప్రాణమయ్యు వడచల్లుదురే యిటులైనజోటి యె
చ్చోటికిఁ బోవు నీచలువ చూపవనా పవనాఘనాదృతిన్.

192


క.

అని పలికి కలికిచెలువలు, మనసిజతాపాతపోష్మమందద్యుతియై
తనరువధూతనువల్లిక, ఘనశీతలరీతిఁ దేర్పఁగాఁ దగు ననుచున్.

193


చ.

చెలువల కిష్టమూలములు శీరము లుజ్జ్వలదంశుమదత్పలా
దళములు వెన్బలంబులు సదామృదులాకృతి మంచివారిలో
మెలఁగుమృణాళముల్ గరము మెచ్చొదవిందుమధూళి మాటలో
పలియవి యన్నిటం జెలికిఁ బంచశిలీముఖతాప మారదే.

194


వ.

అని శీతలోపచారంబు లాచరించిన.

195


సీ.

నునుమావిచిగురుపానుపు మహాతను శస్త్రశయ్యగాఁ దలఁచుఁ గంజాతనయన
కడిపోనివిరులకంకటి గణించునభూతకంటకాస్తరణంబుగా మృగాక్షి
వలపుగుంకుమపువ్వుతలిమ మంగభనాగ్నిశిఖగా విచారించుసింహమధ్య
శిరము కప్రపుఁబల్కు సెజ్జ సొక్కపుఁగామశరముగా వగచుయోషాలలామ


తే.

మంచిపడమటిపన్నీరు మకరకేతు, విషముగా బుద్ధి నూహించువిద్రుమోష్ఠి
తావిపుప్పొడి శంబరాంతకుపరాగ, మని వితర్కించులలన మోహైకకలన.

196


వ.

ఇట్లు మనోభవమోహదాహంబునం బొక్కి పొరలుచున్నకన్నియ నెచ్చెలులు నికేత
నంబునకు మరలఁ దోడ్కొనివచ్చి రంతఁ గొంతకాల మరిగిన నొక్కనాఁ డేకాంతం
బున విద్యామంటపంబుననుండి చదువుఁ జెప్పుచు దదీయసౌందర్యవయోవిలాసంబు
లీక్షించి మన్మథాతురుండై మందుండు భువనమోహిని కిట్లనియె.

197


చ.

నిరవధికత్వరం బఱచి నీచనుగొండలసంధి డెందపుం
దెరుబరిమారచోరనిహతిం బడి మోహవిదాహవేదనన్