పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/151

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అది ముదిత కొసఁగకున్నన్, బ్రతుకదు చెడచెడఁగరాదు పరిణామమనన్
మదిఁగదిరిన వెఱఁ గ్రకచుం, డిది యెవ్విధి దొరకు భార్య నెట్లీడేర్తున్.

43


క.

బహుమానుం డొకఁ డున్నాఁ, డహితుఁడు గాఁ డతఁడు హితుఁడు హాహా ముక్త
స్పృహగృహరక్షార్ధము దు, స్సహకుహనాప్రజ్ఞ నెట్లు చంపుదు నతనిన్.

44


చ.

నిరతము విశ్వసించు నతినిర్మలచిత్తున కెగ్గుసేయుకా
పురుషుఁడు దక్క భూరికులభూమిధరంబులు గావు సప్తసా
గరములు గా వరణ్యములు గావు భరంబని ధాత్రి మైత్రి నా
సిరిపరుతోడ విన్నపము సేయదె వేఁడిన నట్లు గావుతన్.

45


చ.

కడపట భార్యనిల్కడకుఁ గాఁ జెలికానికి నెగ్గుసేఁత యె
క్కుడుదురితంబు కాఁపురము గూలఁగఁ జూచుటయు న్మహాఘ మి
ప్పడఁతుకపట్టున న్సఖునిపట్టున నింతి విశేష మింతకై
చెడుపనియేనియుం దగిలి చేయక మానఁగరాదు గొబ్బునన్.

46


వ.

అని నిశ్చయించి బహుమానవధోద్యోగంబునం దిరిగి వచ్చె నప్పు డుప్పొంగుసమ్మ
దంబునం బ్లవంగపుంగవుండు.

47


క.

క్రకచావికచాదృతియొ, ద్దకుఁ గ్రమ్మర నరుగుదెంచెదవు కులకాంతా
నికట మకటా యసహ్యం, బొకొ సత్యముఁ జెప్పుమనిన నుదచరుఁ డనియెన్.

48


ఉ.

ఏను భవన్నియోగమున నేగి ఫలంబులు కాను కిచ్చినన్
మానిని పల్కె నీ వరిగి మాసకమయ్యెఁ బ్రవాస మెవ్విధిం
బోనిది నీకు నెద్ది గతమో గతమోహభవద్విరంబు నా
తో నెఱిఁగింపుమన్న భయదూరసదాదృతి నంటి దానికిన్.

49


చ.

తనరు ననూనధామతిమిధామతటంబున లెక్క కెక్కుడౌ
ఘనఫలరాజిఁ గ్రాలు మధుగర్భమునాఁ జనుమేడి దానిపై
మను వనువాసరంబు బహుమానుఁడు తత్కపిచక్రవర్తిప్రో
పున నితరం బెఱుంగక యపూర్వసుఖస్థితి నుంటి దాలిమిన్.

50


చ.

మఱువఁగ రానిసఖ్య మది మాటలు వేయును నేల పుట్టి
బెఱిఁగితిఁ గాని యట్టిజగదేకపవిత్రునిఁ జూడ నెందు నో
తెఱవరొ యంచుఁ బాఠకుగతిం గృతి నీయుపకారకృత్యముల్
గుఱిగడవం బ్రియంబుతమిఁ కొండలు కోటులు చేసి చెప్పితిన్.

51


ఉ.

చెప్పిన నంతరంగమున సింగఁడు బూకఁడునై ప్రియంబు సొం
పుప్పతిలంగఁ బల్కె నది యోయికృతఘ్నుఁడ వీవు గావె య