పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గారములం జరింపుచు సుఖస్థితి నుండు కొఱంతలేక యో
భూరివివేక యంచుఁ గడిపోవనిభక్తి బహూకరించినన్.

320


వ.

కృతకృత్యుండ నయితినని ధైర్యవిజితనీహారాచలానర్గళప్రచారంబున దుర్గబాహ్యా
భ్యంతరంబులం బ్రవర్తించి యన్నియుం గనుంగొని శరీరవర్ధనపర్యంతంబు చింత
దొరలకుండ ఘూకంబులం గలిసి మెలసి పక్షంబులు వ్యవహరదక్షంబు లగుటయు
నొక్కనాఁ డెడఱునేచి యులూకమూలోత్పాటనంబునకుఁ బృథ్వీరుహదుర్గకోట
రద్వారంబుల నీరంబులుగాఁ బూరిఁ గూరి నీరసేంధనంబులు దుఱిఁగి కరీషపిండఖం
డంబులు గ్రుక్కి యక్కడ నిలువక మేఘవర్ణుం గానంబోయి యవ్వాయసపతిచేత
సంభావితుండై యప్పు డుపస్థితంబైన కార్యము విన్నవించి చిరజీవి యిట్లను నీవు
ను నిన్నుం గొటుచువారును నీరసతరుశాఖలను గొఱవులను బట్టుకొనిరండు వైరిసం
హోరసమయం బిది యని తెలుపుటయు.

321


క.

ఎరవలిపట్టినకొండల, కురువడిఁ జని కాకిమూఁక లొక్కటఁ గొరవుల్
వరవరలైనపిడకలు తరిగైకొనిపోయిు ధీరతం దరికొల్పన్.

322


మ.

తగ నత్యుద్ధతి మించువాయువులచేత వ్రాఁజితోడ్తోన క్రొం
బొగలై కీలలు పర్వి నిక్కఁ జిఱునిప్పు ల్రాచి యుక్కుమ్మడిన్
గగనం బంటి ఘనస్ఫులింగములు నాల్కల్గ్రోయునచ్చిచ్చునం
బగిలెం బ్రేలిపడెం దివాంధకులము ల్భస్మంబు లయ్యెం దుదిన్.

323


క.

ఈవడువున నిశ్శేషము, గా వైరుల సంహరించి కౌతూహలసం
భావితుఁడై యప్పుడు చిర, జీవికి నలకాకరాజశేఖరుఁ డనియెన్.

324


క.

పగవానిగృహము మృత్యువు, మొగ మచ్చో నిన్నిదివసములు గట్టా యే
పగిది జరించితి వీ వని, వగచినఁ జిరజీవి మేఘవర్ణుని కనియెన్.

325


చ.

అడఁకువఁ గార్యకాంక్షి యగునాతఁడు దేజము డాఁచి దుస్థితు
ల్గుడుచుచు నీచుఁ గొల్చి తిరుగుం దివిషజ్జయులై ధరిత్రిఁ బే
ర్పడినసహోదరు ల్దనకుఁ బ్రాపుగ నుండియుఁ బుణ్యగాథలం
గడపఁడె మత్స్యరాజసముఖంబున ధర్మసుతుండు కాలమున్.

326


ఉ.

పౌరుషము న్మహాబలముఁ బండితభావముఁ గల్గినట్టియా
ధీరుఁడు కార్యదాహనిరతిం బరుఁ గొల్చు మహానసాగ్నిధూ
మారుణతాక్షులు న్మలినమైనపటంబు మహావిభూషితా
కారము దర్వియున్మెఱయఁగా నలభీముఁడు మాత్స్యుఁ గొల్వఁడే.

327


ఉ.

పౌరుష ముజ్జగించి నగుబాటున కోరిచి సాధుగర్హితా