పుట:నృసింహపురాణము.pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

9


ద్యాగురుఁ డైన మద్గురుముఖాంబురుహంబునఁ గంటి నిప్డు త
ద్వాగభిరూపితార్థము భవద్వచనంబుల కుత్తరం బగున్.

7


సీ.

ప్రోగులై యెందును బోఁ గేర్పడక యున్న శ్రుతు లన్నియును నోజ సూత్రపఱిచె
ముఖ్యశాస్త్రంబుల మునికోటిఁ జదివించి యెల్లచోటుల వెలయింపఁ బనిచె
నాదిపురాణంబు లయ్యైమతంబులపేళ్లు వెట్టియు నిరూపించి నిలిపెఁ
బంచమవేదమై పరఁగు మహాభారతముఁ జేసి పురుషార్థసమితిఁ బ్రోచెఁ


గీ.

బుట్టినప్పుడె సంసృతిపొలముఁ గప్పు, నట్టియెఱుకను బుట్టినపట్టిఁ గనియె
నెవ్వఁ డట్టిమద్గురు నుతియించి భక్తి, విష్ణుమాహాత్మ్యకథ లెల్ల విస్తరింతు.

8


వ.

సమాహితహృదయుల రై వినుండు.

9


ఉ.

సంతతపుణ్యవర్తనుఁడు సద్గుణసంవృతకీర్తనుండు ని
శ్చింతమనస్సరోరుహవశీకృతకృష్ణుఁడు వీతకృష్ణుఁ డా
క్రాంతనియత్యపేలవుఁడు గాలవుఁ డన్ముని తీర్థసేవనా
త్యంతికభక్తి మేదినిఁ బ్రదక్షిణవృత్తిఁ జరించె నెల్లెడన్.

10


సీ.

అర్థి గంగద్వార మాడెఁ బుష్కరములు గనియె హరిక్షేత్రమునఁ జరించె
గౌశికిఁ గొనియాడెఁ గాశి వసించెఁ బ్రయాగంబు సొచ్చె గయావటమున
నిలిచె గంగాపయోనిధిసంగమముఁ జూచె శ్రీపురుషోత్తమసేవఁ జేసె
సింహాచలం బుపాసించె గోదావరీకృతగాహనుం డయ్యెఁ గృష్ణవేణిఁ


గీ.

దఱిసె శ్రీవేంకటాచలస్థాయిఁ గొలిచె, సహ్యజావేణి ( దోఁగెఁ దత్సవిధసీమ
సస్తసాలాంతరశయాను సరసిజాక్షు, రంగనాథుని నెఱఁగె శుభాంగుఁ డగుచు.

11


వ.

ఇట్లు పరిపాటిం బ్రసిద్ధంబు లగు తీర్థంబు లాడుచు మఱియును.

12


క.

గోకర్ణము సహ్యగిరియు, శ్రీకుల్యముఁ బుష్పనగము సిద్ధాచలమున్
లోకనుతుఁడు చూచుచు ల, క్ష్మీకలిత మహోబలంబుఁ జేరెం బ్రీతిన్.

13


క.

అందు భవనాశనీనది, నందనదళితారవిందనవమకరంద
స్యందమదవదిందిందిరఁ, జందనచంద్రాంశువిశదసలిల భజించెన్.

14


వ.

తదనంతరంబ.

15


ఉ.

ఆమునినాయకుండు వినయానతుఁడై కొలిచెం జగత్త్రయ
స్వామిఁ బ్రసన్నభక్తినయవాఙ్మయుఁ గామితభక్తలోకర
క్షామణి సర్వదైవతశిఖామణి శ్రీనిధి సత్కృపానిధిన్
శ్రీమదహోబలేశ్వరుఁ బ్రసిద్ధమహత్త్వజితాఖిలేశ్వరున్.

16


వ.

ఇవ్విధంబున శ్రీనరసింహసందర్శనం బొనరించి కృతార్థుం డై యచట ననేకముని
మహర్షిమధ్యంబున మధ్యందినదినకరానుకారియై తేజరిల్లువాని శ్రీమన్నారాయణచ
రణైకభావు దేవశ్రవుం డనుమునిపుంగవుం గనుంగొని సమస్కరించి యతనిచేత