పుట:నీలాసుందరీపరిణయము.pdf/35

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృష్ణునికి బ్రాహ్మణుఁడు నీలను వర్ణించి తెల్పుట

తే.

పాఱుఁ డపుడెదఁ గడుఁబెంపుమీఱ నెలమి
నాలకాపరికడకు డాయంగఁజేరి
సంతసంబున నతనితో నంత కంత
కింపు దళుకొత్త మెల్లన నిట్టు లనియె.

11


సీ.

విను సామి! నీతండ్రిపనుపున నీమామ
            యగుకుంభకునియింటి కరుగుదెంచి
యతనిసేమంబెల్ల నారసి మీసేమ
            మెలమితో నతనికిఁ దెలియఁ జెప్పి
యమ్మేటి యిడుమానికమ్ములు సొమ్ములు
            వలువలుఁ గైకొని వచ్చునెడను
దనముద్దుఁబట్టి నీలను దోడితెచ్చి యెం
            తయు నెమ్మి దీనికిఁ దగిన పెండ్లి


తే.

కొడుకుఁ దెల్పు మటంచు నన్ గూర్మి నడిగి
మిమ్ముఁ జెప్పిన నతఁ డపు డెమ్మె నలరి
నందునకు మీకు నెఱిఁగించి పొందుమీఱ
నయ్య! యిప్పని యొడగూర్చు మనుచు వేఁడె.

12


తే.

జాను మీఱినచానయు మేనమామ
కూఁతురును లేఁతపరువంపుగుబ్బెతయును
నెవరు కదిసిన దగుటను నీకు దాని
కోర్కు లివురొత్తఁ దవులుకోఁ గూడు నొడయ.

13


క.

ఆకన్నియసోయగ మో
రాకాసులసూడ! పాఁపరాకొమ్మలయం