పుట:నీతి రత్నాకరము.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92 నీతిరత్నాకరము

కొనిరి. ఇఁక నిట్టిదుష్కార్యములు సాగవని తలంచిరి. పిదపఁ దమ తమయిరవులకుం బోయిరి.


ఆఱవ వీచిక.

“ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచుక్ ధృత్యున్నతో శ్సాహులై ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్' గావున!".”

అని ప్రాచీనోక్తి కలదు. ఆనూ క్తి యే కాలమున నైనను మార్పునొందదనుట నిక్కునము. ఈ ర్యాళువులు సాధువుల మేలున కే కీడు గల్గింపఁ బూనుదురు. ఇది లోకముస సాధారణ ముగా సాగునాచావము. ఈ యాచారమునకు లోబడక యుండువారు లేదన రాదు విరళముగా గలరసవలయు. -ఈయాచారమును బాటించియే "కాఁబోలు పాళు నిబంధు వులు వాని కారాగార ప్ర వేశము మొదలుకొని లేఖల వాసి రారామదాసని కృష్ణదాసని లోనగు పేరులతో శ్రీవత్సాంకదాసు నకుఁ బంపసాగిరి. రాధిక ప్రవర్తనము మంచిక "కాదనియుఁ, బెక్కం డ్రామెకు నే స్తగాండ్రు, కలరనియు, మీవంటిమం"్యద గల కుటుంబముల వా కట్టికన్యకలను గోడండ్రగా గ్రహింప రాదనియు, సౌందర్యమునుబట్టి మీరు మోసపోయినను స్వల్ప కాలమునకే మీమర్యాద యూడిపోవుననియుఁ, దర్వాత విచారించిన లాభము లేదనియుఁ గొంత యాలో చించి ప్రయ త్నించిన మేలనియు, నందు వాయఁబడుచుండెను. రామ దాసు శ్రీనివాసదాసునకు మిత్రుడనియు, మీసంబంధమును