________________
88 నీతీరత్నాకరము పాతాళుఁడు చెప్పినది దాఁచిరి. పెండ్లి యన్న మేమా యాలయమున నుంటిమనియు, జననీజనకు లేల రాలేదని ప్రశ్నించితి మనియు, నింతలో వేంక టేశాదులు వచ్చిరనియుఁ దెల్సిరి. అనంతాచలశర్త తనకుఁ దెలిసిన విషయము తెలుపుచు సుంత యు దాఁపక సవిస్తరముగాఁ దెల్పెను. వేంకటేశ్వరాదులు గురునానతియుఁ దమరచట దాఁగియుండుటయు సమయమున నాలసింపక పై ఁబడి వానిని గుంతలుని బట్టుకొనుటయును దెలిపి వెంటనే భరతపురమునకుం బోయి పెద్దలకుఁ దెలుపు టయు వారు సాయపడుటయు లోనగు తమకృత్వములఁ దెలిపిరి. విచారింపఁదగిన వారెల్ల విచారింపఁబడిరి. రెండుదిన ములు నిరంతరముగా విమర్శించి యామఱు దినము తీర్పు చెప్పుదుమని న్యాయమూర్తు లనిరి. ఎల్లవారు నిండ్లకుం బోయిరి.
మఱుదినము న్యాయస్థానము మనుజులచేఁ గ్రిక్కిఱిసి యుండెను. ఎపుడు న్యాయమూర్తు లను దెంతురో ఏమి తీర్పు చెప్పుదురో యరయుదమని 'వేచియుండిరి, వీరి తొందఱపా టుచే మఱింత యాలస్యము న్యాయమూర్తి చేయుచున్నయట్లు తోఁచెను. యథావిధిగా న్యాయాధిపతి యరు దెంచెను. సింహపీఠిక నలంకరించెను. శ్రీనివాసదాసు 'రాధికయుఁ బోయిరి. రాధిక యథాపూర్వస్థలమున సపరిచారికయై యుండెను. పండితు లెల్ల న్యాయాధిపతి కెదుటనే కూరుచుండిరి. అంతట నుత్తమాధికారి తీర్పు నిట్లు చదివెను.
“ ఈయభియోగమున న్యాయపరిశీలస మంత దుర్బే ద్యము కాదు, ఇట్టి వ్యవహార మెన్నఁడు వినలేదు. పాతా