పుట:నీతి రత్నాకరము.pdf/75

ఈ పుట ఆమోదించబడ్డది

నీతిరత్నాకరము

72

దొకవృక్షమూలమున నించుక శయనించి మరలఁ బ్రయాణము చేసెను. యధాపూర్వముగా దుశ్శకునములు కాసాగెను. భగవన్నామము జపించుచు సర్వానర్ధపరిహర్త పరమేశ్వరుండని నిశ్చయించుచు మరల దుశ్శకునములకు జంకియు మరలధైర్యము తెచ్చుకొని వానిని లెక్కింపనట్లు ప్రయాణము జరపుచునే యుండెను. సూర్యోదయమై కొంత ప్రొద్దెక్కెను. వడినడిగా గుఱ్ఱములు నడచుచునే యుండెను. మధ్యా హ్నము కావచ్చెను. అపుడపుడు దుశ్శకునము లగుచునేయుండెను. ఎండకుబడలి యొక గ్రామమున సత్రమునకు ముందున్న తోటలో దిగి వంట చేయ నాజ్ఞాపించి తాను నాలోచించు చుండెను.


ఐదవ వీచిక.

విలాసధామమున రాత్రి నాలవజామునఁ బ్రయాణమయిన యాశ్వికులు చావుపర్వున వాని నడిపించుచు శ్రీనివాసదాసు భుజించి యిఁకఁ బ్రయాణము చేయుదమా యని యూహించు చుండ నచ్చటఁ జేరిరి గుఱ్ఱములు నీరు తాగినపిదప నించుక సేపు సేదదీర్చుకొని ప్రయాణము సాగింతమని వారు సత్రముకడఁ జెట్ల క్రింద నిలిచిరి. సేవకుఁడు బయటి కెందులలో వచ్చి వారిం గాంచెను. వారు నావార్త వానికిం దెల్పి వానింగూడి తోట లోనికిం బోయి దాసుగారికి: జెప్ప లేక యావార్తం దెల్పిరి. శ్రీనివాసదాసు నిశ్చేష్టుఁడై రాధికాయనుచుఁ బడిపోయెను. శీతలోపచారము లొనరించి యెట్లో స్మృతి వచ్చునట్లు చేసిరి.