పుట:నీతి రత్నాకరము.pdf/67

ఈ పుట ఆమోదించబడ్డది

64

నీతిరత్నాకరము

ఇంక నన్ను మాటలాడింపకుము. నీయిచ్చవచ్చిన చొప్పునం జేయుము. అని ధ్యానము నాశ్రయించి నిమీలిత నేత్రయై పరదేవీ పాదారవిందములం దలంచుచుండెను.

పాతాళుఁ డాపలుకులకు నా గ్రహించెను. నాచేతఁ జిక్కియుఁ గాఱులాడెదవా యని యదలించెను. నీకంఠముంద్రెంచి రక్తధారల నంబాపాదారవిందములఁ బ్రక్షాళన మొనరింతును. రవంతసేపు తాళుమని భయ పెట్టెను. ఏమో జపించి నట్లు నటించెను, కాళికాసమీపమునకుం బోయి సాష్టాంగ నమస్కారముల నాచరించెను. లేచి కరములముకుళించి భగవతిని వినుతించెను. ఖడ్గము నా మెపదనఖరములకుం దగిలించి యందు కొని జళిపించెను. జననీ! కన్య కారత్న కంఠలుంఠన మొనరించి వేఁడి నెత్తురు సోనల నీకర్పించి కృతకృత్యుండ నయ్యెద. నాకర వాలముచివరన నిలిచియుండుమా యని యభ్యర్థించెను. ఒక్క దాఁటున వచ్చి రాధికా కాంత మ్రోల నిలువంబడియెను విశేషించి యామెను బలుకరింపక యేమోగొణుగుకొనుచుండెను. అర్చకుల కిరువురకుఁ బాదములు మొదలుకొని యుత్తమాంగమువఱకు వడఁకసాగెను. ఏమో యుపద్రవము "రానున్నది. మన మేల యీ పెంటలో దిగితిమిరా స్వామియని చింతింపసాగిరి. కరవాలమున కాహుతి కానీయక మన మాపవలయునని యూహించిరి. కాని యాతని భీషణాకారమును గాంచి మనకే యాపని యగునేమో యని యనుమానింపసాగిరి. కుంతలుఁడు పడకుచు నేనేల యీ క్రూరుని మాటలవింటినని పలుభంగుల విచారించసాగాను. ఏది 'యే మైనను గన్యక ప్రాణముల దక్కింపవలయునని నిశ్చ