పుట:నీతి రత్నాకరము.pdf/66

ఈ పుట ఆమోదించబడ్డది

నాల్గవ వీచిక

65

యించెను. 'వ్యాధులిద్దఱు బదులాడక దూరముగాఁ గూరుచుండి యుండిరి. కొంత సేపిట్లు గొణిగి గొణిగి రాధికా ! ఇది కడ సారిమాట. ఏమందువు ! అని యదలిం చెను. ఖడ్గమును జళిపించెను. ఔడుగఱచి కత్తినాడించెను. అది కుక్కనాలుకవలె నల్లల నాడుచుండెను. ఒక్క వేటున కెందఱికంఠములనైన దునుమఁగల ధార దానికిం గలదనుట నిక్కము. రాధిక పలుకలేదు. తల్లిదండ్రులం దలంచుకొని యిఁ కేటి జనకులని వదలి భగవతి ధ్యానించి యెట్టికష్టములనైనఁ దొలఁగింతువని నమ్మితిని. నీదయ అని వినుతించుచుండెను. అంతఁ బాతాళుఁడు కరవాలాగమును రాధికాకంఠమునకుఁ దగులఁ జేసి యిదె మఱియొకసారి హెచ్చరించుచున్నవాఁడ. ఏమందువు? సన్ను వరింతువా. ఖడ్గ ధారకు బలియగుదువా యని 'బెదరించెను. బదులు లేదు. మూఁడుసారులు కత్తిని దనచుట్టును ది ప్పెను. కాళికా ! ఇవె కన్యాకంఠరక్తధారలు. తనివిదీఱఁ గ్రోలుమా యని కత్తి మరల జళిపించెను. వానిమోము చూడఁ దరము గాక యుండెను. అర్చకు లిరువు రుత్తరీయముల నడుములకు బిగించి నిలువఁబడిరి కుంతలుఁడు దర్భగ్రంధి యవలఁ బాఱవైచి చేతికఱ్ఱనూని నిలుచుండెను. కత్తియె త్తగనే యడ్డుపడవలయు నని యాతనియూహ, పాతాళుఁ డంబకు నమస్కరించి సెలవా జననీ ! యని యడిగెను.

ఇంక సెలవే లెమ్ము పాతాళా క్రూరమానసా! సెలవే. అను కరాళాట్టహాసయుత వాక్కు లెందుండియో వినఁబడియెను. అర్చకులు కుంతలుఁడు నులికిపడి నలుదిక్కులకు దృష్టులఁ బ్రసరింపసాగిరి. అంతలో వేంకటేశ్వరుఁడు దేవి పృష్ఠ