పుట:నీతి రత్నాకరము.pdf/102

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

ఆజవ వీచిక. ఫలకుసుమ కుంకుమ పరిమళవస్తు వ్రాతములఁ గైకొనియుఁ బురుషులు ఫలమంత్రాక్షతలఁ బూనియు నెదురుగఁ బోయి శ్రీకృష్ణ దాసును నాశీర్వదించి యతని జననీజనకుల బహూకరిం చిరి. అది వారియింటఁ గలమర్యాద. ఆయాచారము నడపి ప్రార్థించి వరునిం బూజించి తోడి తెచ్చిరి. అం దమర్పఁబడిన యున్న తాసనముల పై ఁ గూరుచుండఁ జేసిరి, హారతులెత్తి సువా సినులు దీవించిరి. విద్వాంసులు పెండ్లి కొడుకువు గమ్మని యాశీర్వ దించిరి.

అంతట శ్రీనివాసదాసు నిందిరా దేవియు నరు దెంచి కులో చితమర్యాదలం బాటించి కొంతతంతు నడపి విధివిహితముగ వరపూజ చేసిరి పాదములు కడుగుచు నాతని లక్ష్మీ నారాయణ స్వరూపునిగా భావించిరి. పిదప నొకరత్న హారము పురోహి శుఁడా శ్రీకృష్ణ దాసునికంఠమున వైచెను దాసు విహితపూజ లొనరించి కన్యాదానమును గైకొన రమ్మా యని యభ్యర్థిం చెను. పిదప వీరకానికి వీరకత్తియకును మర్యాదలు నడపిరి. వాద్యములు మ్రోఁగుచుండ వారవనితలు పాడుచుండ ద్విజ ప్రవరులు వేదమును బఠించుచుండఁ బ్రయాణము సాగించిరి. యానాధిరూఢులై కొందఱు పోయిరి. మందమందగమనముల విలాస ధామమును బ్ర వేశించి విడిదియింట వారినెల్ల నిలిపి వారి బంధుమి త్రాదులకుఁ దగినగృహములం జూపి యాయాయధి కారు లవ్వారికిం దగుసపర్యలు సలుపఁ గట్టుదిట్టములు చేసి శ్రీని వాసదాసు స్వగృహమునకుం బోయెను.

ఆరాత్రి యెల్లరకు క్షణకాల మట్లు తోఁచి గడచెను. ప్రతిగృహము వివాహమందికముగ నే తోఁపఁ జేయుచుండెను.