పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆమేళముతో ని ట్టను, భామామణులార యీగిపని యెంత మముం
గామించి కొలువ వచ్చితి, రే మంచిది యయ్యె నిలువుఁ డిచ్చో ననుచున్.

81


వ.

వారలకుఁ బూర్వావశిష్టంబు లైన యష్టాపదవిశేషంబులు పరామర్శించి
పేరిపేరివరుస మేలువెచ్చంబునకు నిచ్చి వియచ్చరనగరోపమంబు లగు
విడుదు లొసంగిన నాకపటనటీనటఘట లాపుటభేదనంబున నిలిచి యుప్పట
ప్పటికి నప్పిశితాసికి నుల్లాసంబు దెచ్చు పొరపొచ్చెపుటిచ్చకంబుల మెచ్చు
నవయుచుఁ దొడిమ విడిచిన యుర్వారుఫలంబునుంబోలె సర్వసేవకసమూ
హంబునందును సర్వాంఛితుం గావించి సేవించి రయ్యవసరంబున.

82


క.

మదనుని యాఱవబాణము, మదిరాకన్యకకు మేలుమానిసి యై యా
మొదలిటివేలుపుదొర సద. మదమగుఁ దుదలేనిరతుల మాపు వ్రేపున్.

83


క.

రాగాంధుఁ ద్యక్తబాంధవు, భోగాంబుధిమగ్ను నస్రపుని విడిచి నిజో
ద్యోగంబు లుడిగి వెలవెల, నైగడిసీమలకుఁ జనిరి యాప్తులు హితులున్.

84


వ.

పరివారంబునుం బరిహృతజీవితం బగుటఁ బలుదెఱంగుల నంతరంగంబుల
బొక్కుచు దిక్కటకంబు లధిష్ఠించె నిట్లు.

85


సీ.

చినికి రూపఱి పోయె నవరత్నమయశతాంగములు వానల నెండగాలిఁ దూలి
గజహయంబులు గడ్డిఖాణంబు లెఱుఁగకనాఁడు నాఁటికిఁ దొంటిపోఁడి ముడిగె
బంగారుప్రతిమల ప్రతివచ్చు ననవచ్చు నుడిగంపుఁ గొమ్మలు బడుగు లైరి
దండనాయకులు మిత్రములు నీతిజ్ఞులు గురువులు దిటదప్పి కొంచెపడిరి
మధుమదాయత్తుఁ డై మేనుమఱచి మదిర, నంటువాయఁగనీక పుష్పాస్త్రవిశిఖ
శిఖలజంతికతొలు లైనచిత్తమగల, హంసుఁ డెరగొని యుండునయ్యవసరమున.

86


క.

తనరాజ్య మెల్ల నీక్రియ, నను వేదుట యూడిగముల యందలిజనము
ల్వినిపింప విని నిశాటుఁడు, తన మదిలోఁ దలఁచె వజ్రధరుఁ దలఁచుటయున్.

87


సీ.

ఆకుపచ్చనిచాయ నపమళింపెడు వేయుహయములఁ బూనిన యరుద మెక్కి
ధూమావృతానలద్యోత మై స్ఫీత మై ఝంపతో నశనిధ్వజంబు గ్రాల
హరిచందనాలిప్త మగుప్రకోష్ఠము గల పిడికిటఁ బట్టినభిదుర మమర
హారకిరీటకేయూరతులాకోటికంకణాదులకాంతి కడలుద్రొక్క
నలఁచివైచిన హరిచందనంపువలపు, ప్రబలి నలుదిక్కులందును గుబులుకొనఁగ
దివ్యమాల్యాంబరాదృతిభవ్యమూర్తి, మహితలంబున కేతెంచె మఘువుఁ డపుడు.

88


క.

ఏతెంచి తగినవిధమున, దైతేయాధీశుఁ గాంచి తత్పదములపై
భూతలము మ్రోవ మ్రొక్కిన, నాతం డత్యాదరమున హా వలదనుచున్.

89