పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/146

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మత్తకోకిల.

భూరిసత్యసమేతభాషణ భూజనప్రజపోషణా
.........................ర్జనతరమోహితా
భీరుమానసభీతివారణ భీమదోర్బలవారణా
దారుణారితమోనభోమణి దండనాథశిరోమణీ.

208


గద్యము.

ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాదసహజసారస్వతచంద్రనామాంక
భారద్వాజసగోత్రపవిత్ర రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధానపర
మేశ్వర హరిభట్టారకప్రణీతం బైన శ్రీనరసింహపురాణోక్తం బగునుత్తర
భాగంబునందు వాసవప్రముఖులైన దివౌకసులు నాళీకనాభుపాలికిం
జని ప్రహ్లాదువలనఁ దారు పడినఖేదం బెఱింగించుటయు నయ్యాది
దేవుండు దేవతాననలాలనుండై యసురవరుపాలికి వృద్ధవిప్రవేషంబు
నం జనుదెంచి యతనికి వైకుంఠంబుమీఁదికిఁ గార్యానుబద్ధుం డగుట
కుపదేశించియు వైకుంఠంబుపైకి దండు తర్లించుకపోయి మధ్యేమా
ర్గంబున మాయగప్పుటయుఁ బ్రహ్లాదుండు నివ్వెరగంది పూర్వజ్ఞానా
యత్తచిత్తుఁడై శ్రీహరిభజన సేయుటయు నంత హరి ప్రత్యక్షంబై
ప్రహ్లాదు గారవించి హరిదూషణనివారణం బగుటకు మోక్షపదంబగు
నేకాదశీవ్రతమహత్త్వం బుపదేశించుటయు నింద్రప్రహ్లాదుల కాహ్లాద
కరంబు సేయుటయు నన్నకథలంగల పంచమాశ్వాసము సర్వంబును
సంపూర్ణము.