పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/261

ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అంత గృష్ణుండు వారికి నభిముఖుండై తద్బలంబుల నురుమాడుచు
డాయం జని.

385


క.

అరదంబుఁ ద్రుంచి సారథిఁ
బరిమార్చి సిడెంబు నఱికి పౌండ్రకుని శిరం
బురుశస్త్రనిహతిఁ ద్రుంచుచుఁ
బొరలంగాఁ జేసె వృష్ణిపుంగవు లలరన్.

386


ఆ. వె.

కౌశికేంద్రబలము ఖండించి యాతని
తల యిలాతలమునఁ బెళకకుండఁ
గందుకంబు రీతిఁగాఁ దత్పురంబులోఁ
దార్పఁ దత్సుతుఁడు సుదక్షిణుండు.

387


క.

అభిచారహోమకృత్తిన్
రభసంబునఁ బనుప నది దురాసదచక్ర
ప్రభ గెరలి తీవ్రరోష
క్షుభితమతిన్ వాని మ్రింగె సురలు నుతింపన్.

388


వ.

అంత శౌరి తజ్జయంబుఁ గాంచి సుఖం బున్నయెడ.

389

కౌరవపాండవసంబంధము

ఉ.

భోట విదర్భ సాల్వ కురుభోజ కరూశ వరాటలాటిక
ర్ణాట దశార్ణమద్రయవన ద్రవిళాంధ్ర కళింగ చోళ పా
నాట విదేహ ఘూర్జర వనాయుఖ నాయురినాయుతంబు స
య్యాటములన్ స్వయంవరసభాంతరమంచతలంబు లందగన్.

390


వ.

ఉన్నవిధం బెఱింగి జాంబవతీసుతుం డారాజలోకంబు చేరం జనియె.

391


క.

చని సాంబుఁడు దుర్యోధన
తనయను శుభయత్నమున రథముపై నిడ నా
ఘనులగు కర్ణాదులు తీ
వ్రనిశాతాస్త్రములఁ గట్టివైచిరి యతనిన్.

392