చక్కని పాండిత్యం, ప్రతిభాసంపద కలిగిన నరసింహకవి చారిత్రకమైన ప్రాచీన, అర్వాచీన విషయజ్ఞానం లేనందువల్ల అనేకాలైన భ్రమప్రమాదాలకులోనై కొన్నివిషయాలు పేర్కొన్నట్లు గతంలో గుర్తించాము. ఇదేవిధంగా నారదీయపురాణ ప్రథమాశ్వాసంలో కృష్ణుడు దావాగ్నిని క్రోలిన తరువాత వర్షాగమాన్ని వర్ణిస్తూ, వివిధనదులు మహాజనపరిపూర్ణాలై పొంగినట్లు, దేశకాలోచితభిన్నంగా యీ క్రిందిపద్యాన్ని విరచించాడు.
| "గంగాసరస్వతీతుంగభద్రాయము | |
(నార. 21. పు. 120. ప.)
"గండకీ చంద్రభాగ"వంటి నదులు ద్వాపరయుగంనుంచీ వున్నాయని చెప్పడానికి బొత్తిగా అవకాశాలు లేవు. ఏది యేమైనా నరసింహకవి సందర్భోచితాలైన, సార్థకాలైన శబ్దప్రయోగాలనుచేసి తన కవితాప్రౌఢిమను బహుముఖాలుగా నారదీయపురాణంలో చూపించాడు. ప్రత్యేకించి హరిని స్తంభంలో చూపించవలసిందని హిరణ్యకశిపుడు కత్తితో కొట్టినప్పుడు వెనువెంటనే ఆ స్తంభంనుంచి నృసింహావతారరూపంలో విష్ణువు ఛట్ ఫట్ మని పెఠిల్లున ఆస్తంభం పగిలిపోగా ఆవిర్భవించినసందర్భంగా నరసింహకవి తన బహుముఖశబ్దార్థపటిమావీరభావస్ఫోరకత్వాన్ని యీ క్రిందిపద్యంలో ప్రస్ఫుటంగా మహాద్బుతంగా వెల్లడించాడు.
| "పటపటత్కటు సముద్భట పటుధ్వని విశీ | |