పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/27

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రత్యేకమైంది. హిందీ, మరాఠీ, బెంగాలీ తదితర భాషా పండితులు, కవులు అనేక మందితో తాను మాట్లాడినప్పుడు మన అవధానం, చిత్ర కవిత్వం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారని పీవీ పేర్కొన్నారు.

ఎక్కడైనా శ్లేష, శ్లేష తరువాత శ్లేష రెండు పదాల్లో వస్తే అది సాహితీ కౌశల్యానీకి పరాకాష్టగా వారు అభివర్ణిస్తారు. ఉత్తర భారత భాషల్లో భావానికి ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. భాషా పాండిత్యం తక్కువ. అనేక సందర్భాలలో యతి, ప్రాసలు తదితర వ్యాకరణ సంబంధమైన పొరపాట్లు వున్నా భాషాదోషాలను పట్టించుకోకుండా రసగ్రహణం, భావం మాత్రం చూస్తారు. అదే తెలుగు గడ్డపై “రాఘవ పాండవీయం” లాంటి ఒక కావ్యంలో ప్రతి పద్యాన్ని రామాయణ, భారతాలకు అన్వయిస్తూ చెప్పడం మరే భాషలోలేని అపురూపసంపద అని పీవీ నరసింహారావు గారు పరిశీలనాత్మక దృష్టితో వింగడించారు. పూర్వకాలంలో మన దగ్గ యుద్దాలు జరగని సందర్భాలలో రాజులు తీరికగా కూర్చుని, ఒక వంక వారు రాస్తూ మరో వంక మహాకవులైన వారు విశేష రచనలు చేయదానికి దోహదం చేశారని కూదా ఆయన సింహావలోకనం చేశారు.

ప్రపంచ న్యాయ చరిత్రలో మరే భాషలో కూడా లేని అవధాన ప్రక్రియ తెలుగు భాషకే సొంతమన్స, దానినీ ఒక శాస్త్రంగా, ఒక కళగా అభివృద్ధి చేసి, అది అంతరించిపోకుండా ముందు తరాలకు అందించాలని ఆయన సూచించారు. అవధానంలో పాండిత్వంతో పాటు శబ్లాధిపత్యం ప్రధానం. అది లేకపోతే కవి రాణించడు. సుమారు మూడు, నాలుగు వందల సంవత్సరాలుగా తెలుగు నేలపై భాషాకోవిదులు, పండితులు, కవులు అభివృద్ది చేసిన ఈ అవధాన ప్రక్రియకు ఇంకా ప్రాముఖ్యత లభించే విధంగా మెరుగులు దిద్ది అందరికీ రసాస్వాదనీయంగా పునరుద్దరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రిగా వున్నప్పుడు ఆయన తన పనితీరును అవధానంతో పీవీ పోల్చారు. అవధానానికి ఒకరు సమస్యాపూరణమిస్తే, మరొకరు అప్రస్తుత ప్రసంగంలోకి లాగుతారు. మరొకరు గంట కొట్టి దృష్టి, ధ్యాస మళ్ళిస్తారు, ఇంకొకరు నిషిద్దాక్షరి ఇస్తారు. ఈ పద్దతిలోనే తాను పార్లమెంట్‌ లో ప్రశ్నోత్తరాల సమయంలో చేసేది అవధానమే. అన్నారు పీవీ. సభ్యులు వేసిన అడ్జదిద్దమైన ప్రశ్నలకు సరైన జవాబులను చమత్మారంగా చెప్పవలసి ఉంటుంది. చెప్పే జవాబు - ప్రశ్న ఎంత తెలివి తక్కువగా వుంది, అని ధ్వనించే లాగా ఉండాలంటే, తమకు ఎంతో సాధన అవసరమని ఆయన అన్నారు. అవధాన విద్యలో పాండిత్యం, భాషాజ్ఞానం, చమత్మారం ఒక పాఠ్యమైనప్పటికీ, అందులో జ్ఞాపకశక్తి ప్రధానమైనది.

కంప్యూటర్‌ లో చదరంగం ఆదే పద్దతి వ్యాప్తిలోకి వచ్చినట్టుగానే, అవధాన ప్రక్రియ సైతం కంప్వూటర్ల ద్వారా చేసే విశేష ప్రక్రియగా రూపొందాలని శ్రీ పీవీ నరసింహారావు గారు అన్నారు.

లోకంలో ఏకసంథాగ్రాహులు, ద్విసంథాగ్రాహూలు ఉంటారు. చిన్నతనంలో పీవీ. నరసింహారావుగారు ఏకసంథాగ్రాహిగా గణుతి కెళ్ళారు. ఏ అంశమైనా ఒక్కసారి చదివితే ఆయనకు కంఠతా వచ్చేది. అయితే వయసు పెరగడం ప్రకృతి సహజమైన అంశమైనా, తాను నిర్వహించిన పదవుల రీత్యా ఎటు చూసినా ప్రశ్నలే. ఎన్నింటికి సమాధానాలు చెప్పినా ప్రశ్నల పరంపర సంధానం నిరంతరంగా సాగుతున్నది. ప్రతీ మనిషీ ఒక పృచ్చకుడైనాడు. అందుచేత, ఈ ప్రశ్నల కలగూరగంప తన జ్ఞాపకశక్తికి అడ్డం వస్తున్నది. ఈ నేపథ్యంలో, లోగడ మాదిరిగా ఒకసారి కాదుకదా, ఇరవై సార్లు చదివినా ప్రస్తుతం జ్ఞాపకం ఉండడంలేదని పీవీ గారు విచారం వ్యక్తం చేసారు. అయితే ఈ జ్ఞాపకశక్తిని పెంచుకోడానికి శిక్షణ కావాలన్నారు.

ఆయన ఎంత సంప్రదాయవాదో, అంత ఆధునిక దృష్టి కలవాడు. కంప్యూటర్ల వాడకం తప్పనిసరి అని కూడా ఆయన నొక్కిచెప్పేవారు. అయితే కంప్యూటర్లకు ప్రాణం కానీ, మేధ కానీ వుండవు కదా? కాబట్టి సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా మనిషికి కంప్యూటర్‌ ప్రత్యామ్నాయం కాబోదని ఆయన పదేపదే చెప్పేవారు. అనేక యంత్రాలు, సాంకేతిక అభివృద్దికి మనిషే జనకుడు. ఈ సాధన సామగ్రి అంతా మనిషికి సేవకులు. కంప్వూటర్లు మంచి సేవకులుగా వాటితో మంచి సంబంధాలు ఉండాలి తప్ప, మనిషే వాటికి వశమైతే ప్రపంచం నిలవదని ఆయన హెచ్చరించేవారు.

అలనాడెప్పుడో వాల్మీకి, వ్యాసుడు ప్రభృతులు చేసిన రచనల తాళపత్ర ప్రతులు అందరికీ అందుబాటులో వుండేవి కావు. ప్రింటింగ్‌ సౌకర్యం వచ్చిన తరువాత, ఇతిహాసాలు మాత్రమే కాక ఇతర సాహిత్యాన్నంతా గ్రంథాల రూపేణా తెచ్చారు. ఇవాళ కంప్యూటర్లు వచ్చాయి. ఇంటర్నెట్‌ వచ్చింది. సమాచార సేకరణ ఎంతో సులభమైంది. అంత మాత్రాన పుస్తకాలు ప్రచురించకూడదనే అభిప్రాయానికి రాకూడదని, తిరిగి పుస్తకాలను గుర్తించే రోజులు వస్తాయని పీవీ ఆశాభావం వ్యక్తం చేసేవారు. ఇంటర్నెట్‌ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. నెట్‌ లో పొందుపరచిన అంశమే అందరికీ అందుబాటులో ఉంటుంది తప్ప, అది మనిషిలాగ కొత్త రచనలు చేయదనే సత్యాన్ని గ్రహించాలన్నారు.

భారతదేశానీకి ఇంతటి మహామేధావి ప్రధానమంత్రి కావడం ఈ దేశప్రజలు చేసుకున్న అద్బష్టం. ఇంతటి ప్రతిభామూర్తి భారత రాజకీయాలలో అరుదు.

“తాను పుట్టిన గ్రామం ఈ తెలుగు నేలపైనే వున్నది. ఈ గడ్డమీదనే ఓనమాలు దిద్దుకున్నాను. ఈ నేలపైనే దేశసేవ చేస్తూ, తొలి అడుగులు వేశాను. ఆప్తమిత్రులు, బంధువులు ఇక్కడే వున్నారు. ఇది ఖిన్న సంస్క్రుతులు ఎదిగి పూచిన చోటు. ఇక్కడే నా మూలాలున్నాయి” అంటూ ఆత్మావిష్మారం చేశారు పీవీ ఆయన ఒక పరిణిత మనస్వి.

మీ స్పందనను తెలియజేయండి

'అమ్మనుడిలో రచనలలోని అంశాలపై మీ స్పందనను క్లుప్తంగా తెలియజీయండి.

సంపాదకుడు “అమ్మనుడి"

జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి మాచవరం, విజయవాడ-520 004.

ఇ-మెయిల్‌ : ౭64|[౧/2౧7గ౭2౧6౮6|/ 98౧7౭|// ౧0౧

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * నవంబరు-2020

27