పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/88

ఈ పుట ఆమోదించబడ్డది

26

ద్విపద భారతము


జడనిధిలోన నాశ్చర్యంబుగాఁగఁ
బడుగాక" యనుచు శాపంబొనర్చుటయు,
జగము లల్లాడె; భూచక్రబంధంబు
దిగియె; భూవలయంబు దిర్దిరఁదిరిగెఁ;
గులగిరిశ్రేణి యాకులతఁ గంపించె;
జలరాసులెల్లఁ జంచలమంది మ్రోసె;
భానుదీప్తులు మాఁగుబాఱె; నుల్కములు
సోనలై భువిరాలె; సురలు భీతిలిరి .
వెఱఁగును, శోకంబు, విహ్వలం బొదవ
సురపతి సురసుర స్రుక్కి యావేళ
కరిమీఁదనుండి గ్రక్కన నుర్వి కుఱికి,
కరములు మొగిచి, గద్గదకంఠుఁ డగుచు :
“నోసంయమీంద్ర, నీయుల్లంబులోన
సీసుపుట్టిన నెవ్వ రెదురంగఁగలరు!
తనయుఁ డజ్ఞానియై తప్పొనర్చినను
గినియక తండ్రి శిక్షింపంగఁ దగదె!
పశుమతినైన నాభావంబులోన
వశమె నీదగు ప్రాభవంబు నెఱుంగ!
తొలఁగక [1]సాపరాధులకైనఁ గీడు
తలఁపమిగా తపోధనులకు వన్నె!
దేవర యొసగిన దివ్యదామంబు
కావరంబున వైవఁ గరిమస్తకమున;
బాహుళ్యలోలంబ బాధకైకాని,
శ్రీహరిసాక్షి మీచిత్త మే నెఱుఁగ.
నమలాత్మ, నేఁ జేసినట్టి యీతప్పు
క్షమియింపు క్షమియింపు క్షమియింపు" మనుచుఁ
గరములఁ బాదయుగ్మముఁ బట్టుకొనిన,

విరసమందుచు మౌని విరసించిపలికె:
  1. సావధానులకైన (మూ)