పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/689

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

623


పాండవులరణ్యమున కేఁగిన విధమును
విదురుఁడు ధృతరాష్ట్రున కెఱిఁగించుట

“వదనసరోజంబు వస్త్రా[1]ంతమునను
బొదువుగాఁ గప్పుక పోయె ధర్మజుఁడు ;
బాహుయుగ్మముచాచి పవననందనుఁడు
సాహసంబుననేఁగె జగమెల్ల నెఱుఁగ;
నిసుముచల్లుచు నమరేంద్రసుతుండు
కొసరక చనియె సంకుచితమార్గమున ;
భూ రేణుపుంజంబు పొదిగినమేన
నారయ నకులుండు నరిగె శీఘ్రమునఁ ;
దొడరినలజ్జ నధోవక్త్రుఁడగుచు
నడరి సహాదేవుఁ డవలీలఁబోయె;
వెన్నుపైఁ గ్రుమ్ముడివెడలంగ నేఁగు
మిన్నక ద్రుపద భూమీనాథతనయ ;
కోమలకీర్తియై గురురౌద్రయామ్య
సామగానము రూఢిఁ జదువుచు నేఁగె
ధౌమ్యుండు జనులద్భుతంబందిచూడ.
సౌమ్యవర్తనమున సత్యవాక్యముల."
అనవుడు ధృతరాష్ట్రుఁ డావిదురునకు
మనమున వెఱఁగంది మఱియునిట్లనియె:
"ఈవిధంబున వారలేటికిఁజనిరి?
భావజ్ఞ, నాకుఁదప్పక యెఱిఁగించు."
అనవిని విదురుండు నాధృతరాష్ట్రు
జననాథుతోడను సరవినిట్లనియె:
"నీతనూభవులును నెఱయ దుఃఖముల
నీ తెఱఁగునఁబోదు రెంతయు ననుచు

  1. ర్ధ. (మూ)