పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/644

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

578

ద్విపద భారతము.


నీకునిప్పించెద ; నెఱయ ధర్మజుని
జోకతో రిప్పించు ; సులభంబునందు
జూదంబునన్ వాని సొలనకోడింప
మేదినీరాజ్యంబు మెఱసి నీకొదవు;
నూరక పాండవేయులతోడఁ గదిసి
పోరాడి గెలువ వేల్పులకశక్యంబు. "
అనువేళ ధృతరాష్ట్రుఁ డా వాక్యములకు
నొనరంగ నొడఁబడ కొదవియిట్లనియె:
"విదురునిమతమున విశ్వభూభగము
వదలకసేయుదు వ్రతముగానెందు.
జూదంబులాడంగఁ జూడ నిగ్రహము
వాదంబుఁ బుట్టును; వలవదీవనులు.
పాండ వేయులతోడఁ బగ నీకువలదు;
నిండినవేడ్కతో నిరతంబునుండు ;
నామాటద్రోవక నడవునీతులను,
వేమఱు." ననవుడు విని సుయోధనుఁడు
తుది ధృతరాష్ట్రునితోడ నిట్లనియె:
"విదురుండు పాండుభూవిభుతనూజులకు
హితముగా విహరించు నెప్పుడు , నతని
మతముసేయకుము సమ్మదచిత్తమునను ;
దలపోయ నెందు జూదము పురాణములఁ
గలదు దోషములేదు గౌరవంబందు ;
దేవలుండటుచెప్పె దిక్కు లెఱుంగ ;
దేవతాధర్మంబు ధృతిఁ బడయుదురు;
కావున శకునికింకను నానతిమ్ము ;
రావించు వడి ధర్మరాజు నిచ్చటికి. "
ననుటయు ధృతరాష్ట్రుఁ డాత్మఁజింతించి
యెనయంగ నొడఁబడె నెట్టకేలకును --