పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/643

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ద్వితీయాశ్వాసము

577


చేకొనుకంటెను సృష్టిలోపలను
శ్రీకరంబెయ్యది సృష్టీశ్వరులకు ?
నముచిదానవుఁడు కానఁ దపంబుచేసి
యమితప్రతాపుఁడై యలరుటచూచి
ధరణీధరారి యధర్మంబునందు
దురమున వాని నుద్ధురశక్తిఁద్రుంచె ;
నలరినగతి శత్రులగువారినెల్ల
నిలనాశనముసేయ నెంతయువలయు.
నధముఁడైయొండెను నధికుఁడై యొండె
నధిగత పరమార్థులగువారు మెచ్చఁ
జెట్టు చుట్టును జనించినయట్టి మేటి
పుట్టచందంబునఁ బొదలుశాత్రవుల
నణఁచంగవలయు బాహాశక్తితోడ.
గణుతింప వ్యాధినిఁగలితౌషధములఁ
జక్కఁబెట్టకయున్న జనుల బాధించు
నిక్కువం; బటుగాన, నెఱయఁ బాండవుల
లక్ష్మి సర్వంబుఁజాలంగఁ గైకొందు
సూక్ష్మమార్గంబునఁ జోద్యంబుగాను.
పాండవేయులలక్ష్మి బహుభంగిఁ గొనక -
యుండిననాఁడు నాయుదరరోగంబు
మానదు పది వేలమార్గంబులందుఁ ;
గాన దీనికి సుపక్రమము గావింపు."
మనఁ గురుపతితోడ నాడెనాశకుని:
"అనుపమంబగు నాగజాశ్వసన్నాహ
మొనరింప, కాజిలో నుభయసైన్యములు
చెనకకమున్నె ప్రసిద్ధంబుగాను
నాయక్షవిద్యను నైపుణంబునను
నీయెడఁ బరధరిత్రీశులలక్ష్మి