పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/638

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

572

ద్విపద భారతము.


నేర్పరినగుదును నిఖిలంబెఱుంగ ;
దర్పంబులణఁతు ద్యూతముల బాండవులఁ
దూకొనియాడ నాతో నొనఁగూర్పు ;
శోకింపకుండుము సుఖవిశేషములఁ
జాలంగ. " ననియాడు శకునివాక్యమ్ము
లాలించి కురుపతి హర్షించిమించి,
చతురత ధృతరాష్ట్రుచరణాబ్జములకు
నతిభక్తితోమ్రొక్కి యప్పుడిట్లనియె :
"జననాథశేఖర, శకునిమాటలకు
ననుకూలమైయుండ ననిశంబువలయు ;
శకునియు నను సర్వసామ్రాజ్యమునకుఁ
బ్రకటితకర్తగాఁ బరఁగంగఁజేయు ;
నొడఁబడు మతనికార్యోక్తుల. " కనినఁ
గడువిచారముచేసి గౌరవంబునను
బలికెను గురుమహీపాలచంద్రుండు :
"కులగిరిధైర్యుండు గుణసమగ్రుండు
విదురుండు సత్కళావిదుఁ డుత్తముండు
సదమలచరితుండు శాస్త్రార్థవేది
నీతిమార్గంబున నిర్జరగురుని
బ్రాఁతిగెల్వఁగఁజాలు భావంబువాఁడు
సమచిత్తుఁ డుభయపక్షములవారికిని
క్రమమొప్ప నతనితోఁ గడువిచారించి
చేయుదమీపని సిద్ధంబుగాను ;
పాయక భీష్మునిబాహాబలమున
విదురునిమతమున విశ్రుతంబుగను
వదలక మనమహీవలయంబునిలిచె."
ననవుడు ధృతరాష్ట్రు కాసుయోధనుఁడు
మనమునదుఃఖించి మఱియునిట్లనియె: