పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/610

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము


శ్రీభోగ సంపన్న, శివచాపభిన్న ,
సౌభాగ్యసుత్రామ, సాకేతరామ,
శరణాగతత్రాణ జయబిరుదమున
ధర నెగడిన మహాత్మా, చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పఁదొడఁగె.
దానధర్మాచార తత్పరుఁడైన
భూనాథ కులశిరోభూషణుం డధిక
వైభవసురరాజు చార్యాహిరాజు
.........................................
సత్కాంతిరాజు [1]నిశ్చలగిరిరాజు
సత్కీర్తిరఘురాజు సద్ధర్మరాజు
రాజసూయ మహాధ్వరంబొప్పఁ జేసి
తేజంబుతోడ సుస్థిరలక్ష్మి నుండ,
నతనిని నారదుం డఖిలభంగులను
స్తుతియించి, శ్రీకృష్ణుసొంపుతోఁ బొగడె
రాజులువినఁగ సంరంభంబుతోడ:
"రాజీవనేత్రుండు రవికోటితేజుఁ
డతఁడు కేవలుఁడె మహానుభావుండు!
సితపద్మభవ మునిశ్రేష్ఠులయాజ్ఞ
నాదినారాయణుం డబ్జనాభుండు
వేదాంతవేద్యుండు విమలాత్మకుండు

  1. ధైర్యమునకు హిమవంతునివంటివాఁడని కవియూహ కాఁబోలు !