పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/605

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

539


వేడుకతోడ వేర్వేఱనిచ్చినను,
బ్రోడలుపొగడ నప్పుడు ధర్మసుతుఁడు
సంతోషమునఁబొంది సద్వరుణేశు
కంతుభంజనమిత్రుకైవడి లక్ష్మి
చాలంగఁబ్రబలి సోత్సాహుఁడై యుండె.
ఓలి ధరాపాలుఁ డూర్జితశ్రీల
రాజసూయమహాధ్వరము సేయఁబూన
రాజిత నిజమంత్రిరత్నంబులనిరి :
“ధనధాన్యములును రత్నములు గోధనము
ఘనదంతివాజులుఁ గలిగెఁజాలఁగను;
నవనిధానంబులు నానా [1]ధనములఁ
బ్రవిమలంబై నట్టి బండారమిండ్లుఁ
బరిపూర్ణమైయుండుఁ బ్రఖ్యాతముగను ;
అరుదుగా రాజసూయాధ్వరంబివుడు
గావింపు.” మనునంతఁ గమలలోచనుఁడు
వేవేగమునవచ్చి వెస ధర్మజునకు
వందనంబొనరించి వలయురత్నములు
పొందుగానిచ్చినఁ, బుండరీకాక్షుఁ
బూజించి యా యమపుత్త్రుఁడిట్లనియె:
"రాజీవనాభ , ధరాధరవర్ణ,
నీయనుగ్రహమున నిఖిలరాజులును
ఈయెడనరివెట్టి రెంతయుమాకు;
నపరిమితంబైన యర్థంబుగలిగె;
నుపమ విప్రులకును నుచితదక్షిణలు
దానంబులును బ్రసిద్ధముగఁజేయించి
నూనుగా మఖము సమ్మతముగావింపు. "
మనిన నారాయణుం డధిపతికనియె:
"నెనయంగఁ బూజ్యుండ వెల్లయంశముల ;

  1. విధ. (మూ)