పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/601

ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

535


"నీపురిఁగల మానినీరత్నములకుఁ
బాపంబుపొందదు పరపతులందు
రతిసల్పినను; మహీరమణ, నీవిపుడు
హితబుద్ధినుండుమ యెంతయు." ననుచుఁ
జెప్పిన నృపుఁడును జేయుచునుండె.
నెప్పుడు పరధరణీశులవ్వీట
విడిసిన నీలుండు విదళింపుచుండుఁ
గడువడితో; నదికారణంబునను
అనలదేవుండు సహాదేవుమీఁదఁ
గనలుచుఁ గదిసినం గరసరోజములు
మొగిచి మాద్రేయుండు మును శుచియగుచు
మిగులంగ దర్భపై మెలకువనుండి
యగ్నిసూక్తంబు లయ్యెడఁబఠింపుచును (?)
అగ్నిదేవుని ఘను నభినుతిచేసె :
[1]నీతదర్ధం
బులు నిఖిలవేదములు;
పూతంబులకునెల్లఁ బూతయుక్తుఁడవు ;
ధర్మజుక్రతువు కిత్తఱిని విఘ్నంబు
పెర్మితోఁ జేయకు పెరిమ మన్నింపు" :
మనవుడు ప్రీతుండై యగ్నిదేవుండు
జననుతుఁడైన యాసహదేవునకును
వరదుఁడై యుండెను; వడిని నీలుండుఁ
గరిహయరత్నముల్ కనకాంబరములుఁ
దెచ్చి వేడుక సహదేవున కప్పు
డిచ్చి సద్భక్తితో నిట్లనిపలికె?:
"అమితప్రభావ, ధైర్యామరగ్రావ,
విమలకంబుగ్రీవ, విజితారిరావ,

  1. నిత్యత్వమైయుండు (మూ)