పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/575

ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

509


మొనసి గిరివ్రజంబునఁ జెఱఁబెట్టి
దినమునొక్కొకని వధించి నేర్పునను
భైరవపూజలు పాటించి సేయుఁ.
గ్రూరాత్ముఁ డగువానిఁ గువలయాధీశ,
యణఁచిన నీకును నఖిలరాజ్యములు
క్షణములోపలఁ జాలసమకూరు; మఱియు
రాజసూయమహాధ్వరము సేయవచ్చు;
రాజేంద్ర, మును భగీరథనరేంద్రుఁడును,
.. .............................
................................
దోర్విక్రముఁడు మరుత్తుండును, నాజి
గర్వితాహితులను గ్రక్కునఁ ద్రుంచి
సకలసామ్రాజ్యాది సర్వసంపదలు
ప్రకటంబుగాఁ గాంచి ప్రబలిరి; గాన,
నిఖిలసద్గుణములు నీయందుఁగలవు;
అఖిలార్థవేదివి; యరివిజయుఁడవు;
ఏమిదుర్లభము నీకీజరాసంధు
భీమవిక్రమమునఁ బేర్చి త్రుంపగను!"
అని కృష్ణుఁడాడినయట్టిమాటలను
విని ధర్మజునితోడ వెస భీముఁడనియె:

భీమార్జునులు ధర్మజున కుత్సాహము గలిగించుట

"ఉద్యోగహీనున కుర్విలోపలను
సద్యఃఫలంబులు సమకూరవెందు;
బాహాబలాఢ్యుతోఁ బ్రతినదలిర్ప
నాహవంబొనరింప నతికీర్తి గలుగు;
హీనుతోఁ బోరంగ నేకీర్తి గలదు!
మానవునకు మహీమండలంబునను.