పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/573

ఈ పుట ఆమోదించబడ్డది

సభాపర్వము ; ప్రథమాశ్వాసము

507


బురుషోత్తముండును, భూమీతలేశ
వరులలోపలఁ బౌండ్రవాసుదేవుఁడును,
నానానుములు దాల్చి నడుఁకక క్రొవ్వి
పూని వైరంబు దుర్బుద్ధులై యిపుడు
గోరి జరాసంధుం గొలిచియుండుదురు.
దారుణశక్తిఁ బ్రాగ్దక్షిణదిశల
సృష్టీశ్వరులు పురుజిత్తు కరూశ
దుష్టపౌండ్ర కిరాత దుర్మార్గసాల్వ
యవనులు వానినే యలమియుండుదురు;
ప్రవిమలయశులైన పాంచాల మత్స్య
శూరసేన పుళింద సుంహక కుంతి
కేరళ పుష్కర క్షితి పాలతతులు
నెఱి నాజరాసంధునికి నోడి పాఱి,
యఱిముఱి దమభూములన్నియు విడిచి
తిరుగుచునున్నారు దిగ్భ్రమగొనుచు.
సరభసంబున జరాసంధుండు నెపుడు
కంసుని నేనాజి ఖండించుటకును
హింసగావింపంగ నెప్పుడుఁగోరు;
ఆకంసుఁడును దనకల్లుండుగాన
భీకరశౌర్యుఁడై పెర్చి యీసునను
నాతోడ వడిఁ బ్రథనము సేయు నెపుడు;
నాతతజయశాలు రాహంసడిచికు
లిరువురుతోడుగా నేడుదీవులను
దివిఱి రాజులను సాధింపంగఁగలఁడు.
ఆటువంటిడిచికుని హంసునిఁ గూడి
తటుకున సేనాకదంబంబుతోడఁ