పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/568

ఈ పుట ఆమోదించబడ్డది

502

ద్విపద భారతము.


కమలాసనుండు సౌఖ్యంబున నుండు
నమితభంగుల నందు." నని చెప్పుటయును
రాజచంద్రుండు నారదునకిట్లనియె:
"ఈ రాజపూజితుఁడైన రాజు మాతండ్రి
పాండుభూపాలుందు పరమధార్తికుఁడు
దండహస్తునిపురీస్థలి నుండు టేమి?
యాదిరాజవరేణ్యుఁ డాహరిశ్చంద్ర
మేదినీశ్వరుఁడును మెఱసి దేవేంద్రు
సభనున్న క్రమమెల్ల సత్తుగాఁ దెలుపు
రభసంబుతో." నన్న రమణ నారదుఁడు
నాధర్మజునితోడ నప్పుడిట్లనియె:
“ యోధ హరిశ్చంద్రుఁ డుర్వీశ్వరుండు
సప్తార్ణవద్వీప జగతీతలంబు
సప్తాశ్వతేజుఁడై జయమున నేలి,
యాజివిరోధిరాజావళి గెలిచి,
రాజసూయ మహాధ్వరంబు గావించి,
యమితదానములు బ్రాహ్మణులకుఁ జేసి,
కొమరొప్పగా యాజకులకు దక్షిణలు
నేనుమణుంగుల హేమంబులొసగి,
మానుగా జనులసమ్మానంబుచేసి,
వరలోకమున కేఁగి పర్జన్యుసభను
బరమానురాగుఁడై ప్రఖ్యాతినుండె.
దండపాణిపురంబుదరిని మీతండ్రి
పాండుభూపతి నాకుఁ బరఁగనిట్లనియె:
“అధిపులు రాజసూయంబులు చేసి
బుధపూజ్య, యింద్రునివురినున్నవారు;
ఏనిందునుండుట యెఱుఁగుదుగాన
నానందనుఁడు ధర్మనందనునకును